హీట్ పుట్టించిన క‌పూర్ సిస్ట‌ర్స్

క‌ర‌ణ్ షోలో సిస్ట‌ర్స్ చాలా విషయాల‌పై ఓపెన‌య్యారు. చిన్ననాటి ఫన్నీ స్టోరీస్‌ని సిస్ట‌ర్స్ క‌ర‌ణ్ కి చెప్పారు. డేటింగ్ లైఫ్ గురించి ఓపెన‌య్యారు.

Update: 2024-01-04 04:01 GMT

కపూర్ సోదరీమణులు జాన్వీ- ఖుషీ ఇటీవ‌ల `కాఫీ విత్ కరణ్ సీజన్ 8` తాజా ఎపిసోడ్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. బాలీవుడ్‌లో అర్ధ దశాబ్దానికి పైగా అనుభవం ఉన్న అక్క జాన్వీ కపూర్ టాక్ షోలో ప్ర‌త్యేక అతిథిగా మారగా, త‌న‌ సోదరి ఖుషీ కపూర్ తో క‌లిసి చాలా సంగ‌తులు చెప్పింది. యుక్తవయసులో `కాఫీ విత్ కరణ్‌`పై మక్కువతో ఈ వేదిక‌పై కలిసి కనిపించాలని కలలు కనేవారమ‌ని సోదరీమణులు వెల్లడించారు. జాన్వీ కపూర్ ప్రతి సీజన్‌లో ఆత్మవిశ్వాసంతో ప‌రిణ‌తి చెందిన జ‌వాబులు ఇస్తోంది. క‌పూర్ సిస్ట‌ర్స్ ఇద్దరూ తమ అభిరుచుల గురించి మాట్లాడారు. షో హోస్ట్ క‌ర‌ణ్ తో క‌లిసి జాన్వీ-ఖుషీ వేడెక్కించే ఫోటోషూట్ లో పాల్గొన్నారు. అలాగే క‌పూర్ సిస్ట‌ర్స్ స్పెష‌ల్ ఫోటోషూట్ ఇప్పుడు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. ముఖ్యంగా రెడ్ హాట్ డ్రెస్ లో జాన్వీ ఎంతో అందంగా క‌నిపించ‌గా, క్రీమ్ క‌ల‌ర్ డిజైన‌ర్ ఫ్రాకులో ఖుషీ ఎంతో ముద్దులొలికించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.


క‌ర‌ణ్ షోలో సిస్ట‌ర్స్ చాలా విషయాల‌పై ఓపెన‌య్యారు. చిన్ననాటి ఫన్నీ స్టోరీస్‌ని సిస్ట‌ర్స్ క‌ర‌ణ్ కి చెప్పారు. డేటింగ్ లైఫ్ గురించి ఓపెన‌య్యారు. వారి తల్లి అతిలోక సుంద‌రి శ్రీదేవి మరణంతో ఎంత‌గా క‌ల‌త చెందారో కూడా వెల్ల‌డించారు. జాన్వి తన కెరీర్ గురించి మాట్లాడుతూ... బాధలు క‌ల‌త‌ల‌తో ముందుకు సాగ‌డంపైనా, తన జీవితంలో కొత్త ద‌శ గురించి మాట్లాడింది. మరోవైపు ఖుషీ చంచలంగా కనిపించింది. అయితే తన సినీఅరంగేట్రం, కలలు, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఆక‌ర్షించింది. కపూర్ సోదరీమణులు ఖచ్చితంగా ఈ సీజన్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఎపిసోడ్‌ను అందించారు. అలాగే కాఫీ విత్ కరణ్ 8లో లైట్ హార్ట్ టాపిక్‌లతో హృదయాల‌ను గెలుచుకున్నారు.


కాఫీ విత్ కరణ్ తాజా ఎపిసోడ్ లో తన తల్లి శ్రీదేవి మరణం గురించి విన్నప్పుడు, త‌న మ‌న‌సులో ఏం జరిగిందో వెల్లడిస్తూ జాన్వీ ఎంతో ఉద్వేగానికి గురైంది. అక్క జాన్వీని ఖుషీ వోదార్చింది. ఖుషీ గుండె ధైర్యం ఉన్న అమ్మాయి అని కూడా జాన్వీ అంది. నాటి ఆ క్షణాన్ని మళ్లీ గుర్తు చేసుకుంటూ.. షో హోస్ట్ కరణ్ జోహార్‌తో జాన్వీ క‌పూర్ ఇలా చెప్పింది, ``నాకు కాల్ వచ్చినప్పుడు నా గదిలో ఉన్నాను. ఖుషీ గది నుండి ఏడుపు వినిపించింది. నేను త‌న‌ గదిలోకి ప్రవేశించాను.. త‌న‌ను లాగి ఏడ్చేశాను.. కానీ నాకు ఇంకా గుర్తుంది. ఖుషీ నా వైపు చూసింది.. నా వైపు చూసిన నిమిషం త‌న‌ ఏడుపు ఆగిపోయింది.. నా పక్కన కూర్చుని నన్ను ఓదార్చడం ప్రారంభించింది. అప్పటి నుండి త‌ను దాని గురించి ఏడవడం నేను ఎప్పుడూ చూడలేదు! అని కూడా తెలిపింది. నేను ఎల్లప్పుడూ బలంగా ఉన్నానని భావిస్తున్నాను కాబట్టి నేను ప్రతి ఒక్కరికీ ఓదార్పునివ్వాల‌నుకుంటాను అని ఖుషీ తెలిపింది.


తన భర్త బోనీ కపూర్ మేనల్లుడు అర్జున్ మార్వా వివాహానికి హాజరైన శ్రీదేవి 2018లో దుబాయ్‌లో మరణించారు. ఆమె మృతికి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోవడమే కారణమని అధికారులు ప్ర‌క‌టించారు. బోనీకపూర్‌- శ్రీదేవి దంప‌తుల‌కు జాన్వీ, ఖుషీ కూతుళ్లు. దీనికి ముందు బోనీ మోనా శౌరీని వివాహం చేసుకున్నాడు. ఈ జంట‌కు కుమారుడు అర్జున్ కపూర్- కుమార్తె అన్షులా కపూర్ ఉన్నారు. అన్షులా మినహా బోనీ పిల్లలందరూ ఇప్పుడు తార‌లు అయ్యారు.


జాన్వీ 2018లో ధడక్‌తో తెర‌కు ప‌రిచ‌య‌మైంది ఖుషీని జోయా అక్తర్ గత సంవత్సరం ది ఆర్చీస్‌తో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశపెట్టారు. అర్జున్ కపూర్ మొదటి సినిమా ఇషాక్‌జాదే. ఇటీవలే బోనీ స్వయంగా రణ్‌బీర్ కపూర్ - శ్రద్ధా కపూర్‌లతో కలిసి నటించిన తు ఝూటీ మైన్ మక్కార్‌తో తన నటనను ప్రారంభించాడు.

Tags:    

Similar News