ఆ రెండూ నాకు సులభమే..!

బాలీవుడ్‌ తో పాటు టాలీవుడ్‌ లో కూడా స్టార్‌ హీరోయిన్‌ గా వరుస సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ

Update: 2024-06-08 03:15 GMT

బాలీవుడ్‌ తో పాటు టాలీవుడ్‌ లో కూడా స్టార్‌ హీరోయిన్‌ గా వరుస సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ. మహేష్ బాబు కి జోడీగా భరత్‌ అనే నేను సినిమాలో నటించి టాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ కియారా ఆ తదుపరి సినిమా వినయ విధేయ రామ లో నటించింది. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో బాలీవుడ్‌ కే పరిమితం అయ్యింది.

బాలీవుడ్‌ లో బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకు పోతున్న కియారా అద్వానీ చాలా కాలం తర్వాత టాలీవుడ్‌ లో సినిమా చేస్తుంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రామ్‌ చరణ్ మూవీ గేమ్‌ ఛేంజర్‌ లో నటిస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు బాలీవుడ్‌ లో రెండు మూడు సినిమాలను కూడా ఈ అమ్మడు చేస్తుంది.

తాజాగా కియారా అద్వానీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. చాలా మంది హీరోయిన్స్‌ డైట్‌ విషయంలో, బరువు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ కియారా అద్వానీకి బరువు తగ్గడం మరియు పెరగడం చాలా సులభమట.

నేను ఎంత త్వరగా బరువు తగ్గగలనో అంతే త్వరగా బరువు పెరగగలను. నాకు ఆ రెండు కూడా సులభమే అంటూ చెప్పుకొచ్చింది. ఫిట్‌ నెస్ కోసం గంటల తరబడి నేనేం జిమ్‌ లో వర్కౌట్‌ లు చేయను. ఎంత ఇష్టం అయిన ఫుడ్‌ అయినా మితంగా తినడం అనేది నా చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు.

జిమ్‌, డాన్స్‌, స్విమ్మింగ్ అనేది నేను సరదాగా చేసే దినచర్య. ఇష్టమైన ఆహారం ను అతిగా తినడం ఆ తర్వాత ఉపవాసాల పేరుతో కడుపు మాడ్చుకోవడం అనేది నేను ఎప్పుడు చేయను. మసాలా తక్కువ ఉన్న భోజనం తింటాను. నా మొదటి ప్రాధాన్యత ఇంటి భోజనం అంటూ కియారా అద్వానీ చెప్పుకొచ్చింది.

పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండటం మాత్రమే కాకుండా సౌత్‌ లో కూడా ఆఫర్లు దక్కించుకోవడం విశేషం. త్వరలో ఈ అమ్మడు సౌత్‌ స్టార్‌ హీరో సినిమాకు సైన్‌ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News