ఆ విషయం ఇప్పుడు మాట్లాడలేను : కృతి శెట్టి

శర్వానంద్‌ హీరోగా ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌ గా నటించిన 'మనమే' చిత్రం ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Update: 2024-06-01 06:19 GMT

శర్వానంద్‌ హీరోగా ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌ గా నటించిన 'మనమే' చిత్రం ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్‌ విడుదల తర్వాత అంచనాలు మరింతగా పెరిగాయి.

తాజాగా హీరోయిన్‌ కృతిశెట్టి సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ... మూడు పాత్రల చుట్టూ తిరిగే కథ తో రూపొందిన సినిమా ఇది. చిన్న పిల్లాడితో షూటింగ్‌ చేయడం సాధారణ విషయం కాదు. ఈ సినిమాలోని పిల్లాడి సన్నివేశాలు అందరిని మెప్పించే విధంగా ఉంటాయి.

మనమే పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌. నా గత సినిమాలతో పోల్చితే ఈ సినిమా చాలా విభిన్నంగా ఉంటుంది. ఇది నాకు కొత్త పాత్ర. సినిమాలో పిల్లాడి తల్లిగా కనిపిస్తారా అంటూ కృతిని ఇంటర్వ్యూలో అడిగిన సమయంలో తెలివిగా ఇప్పుడు ఆ విషయాన్ని గురించి మాట్లాడలేను. అయితే సినిమా చూస్తే తప్పకుండా సర్‌ప్రైజ్ అవుతారు అంది.

ఇంకా కృతి తన డ్రీమ్ రోల్‌ గురించి మాట్లాడుతూ.. బాహుబలి సినిమాలో అనుష్క చేసిన పాత్ర తరహాలో ఒక మంచి పాత్రను చేయాలని కోరుకుంటున్నాను. అలాంటి పాత్రలు చేసినప్పుడు నటిగా నిరూపించుకునే అవకాశం ఉంటుందని కృతి శెట్టి చెప్పుకొచ్చింది.

యాక్షన్‌ తో పాటు మార్షల్ ఆర్ట్స్ ఉపయోగించే సినిమాలు, పాత్రలు చేయడం ద్వారా కూడా నటిగా తనను తాను నిరూపించుకోవాలని భావిస్తున్నాను. ఈ మధ్య కాలంలో వరుసగా ఫ్లాప్స్ పడ్డ నేపథ్యంలో వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తాను అన్నట్లుగా కృతి చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News