మహేష్ వల్ల మెగా డాటర్ కి పెద్ద కష్టం...!

మెగా ఫ్యామిలీ మొత్తం ప్రమోట్‌ చేసిన కమిటీ కుర్రాళ్లు సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే

Update: 2024-08-08 04:38 GMT

మెగా ఫ్యామిలీ మొత్తం ప్రమోట్‌ చేసిన కమిటీ కుర్రాళ్లు సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మెగా డాటర్‌ నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సినిమాతో దాదాపుగా 15 మంది కొత్త నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నారు. కొత్త వారిని ప్రోత్సహించి నిహారిక చేసిన ఈ సినిమాను కచ్చితంగా అభినందించాల్సిందే.. అలాగే ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆధరించాలి అంటూ చాలా మంది కమిటీ కుర్రాళ్లు సినిమాకు బెస్ట్‌ విషెష్ చెప్పిన విషయం తెల్సిందే.

గత రెండు వారాలుగా హడావుడి చేస్తున్న కమిటీ కుర్రాళ్లు సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కింది. చిరంజీవితో పాటు పలువురు ఈ సినిమా కోసం తమ వంతు అన్నట్లుగా మీడియా ముందుకు వచ్చారు. అందుకే ఈ సినిమాకు జనాల్లో బజ్ క్రియేట్‌ అయ్యింది. కానీ అనుకోని కష్టం ఈ సినిమాకు వచ్చేలా ఉంది. ఈ సినిమా విడుదల అవుతున్న ఆగస్టు 9న అంటే రేపు మహేష్ బాబు సినిమా మురారి రీ రిలీజ్ అవుతుంది. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా చాలా కాలంగా వెయిట్‌ చేస్తున్న మురారి సినిమాను రీ రిలీజ్ కు ప్లాన్ చేశారు.

మహేష్ బాబు ఫ్యాన్స్‌ మురారి సినిమాను కేవలం ఒక్క షో తో అన్నట్టుగా కాకుండా కనీసం రెండు మూడు రోజుల పాటు ఆడించే ప్రయత్నాలు చేస్తున్నారట. రీ రిలీజ్ ను ఎక్కువ స్క్రీన్స్ మరియు ఎక్కువ రోజులు ప్లాన్‌ చేస్తే కచ్చితంగా మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రెగ్యులర్‌ సినీ ప్రేక్షకులు కూడా మురారి సినిమాను చూసేందుకు క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి. వీకెండ్‌ లో సాధారణ ప్రేక్షకులు మురారి సినిమాకు వెళ్తే కచ్చితంగా నిహారిక కమిటీ కుర్రాళ్లు సినిమాకు డ్యామేజీ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సోషల్ మీడియాలో మురారి సినిమా కు ఓ రేంజ్‌ లో ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌ ద్వారా దాదాపుగా రూ.2.5 కోట్ల వసూళ్లను మురారి దక్కించుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. సినిమా రీ రిలీజ్ వసూళ్లను రికార్డ్‌ గా నిలపాలనే ఉద్దేశ్యంతో ఫ్యాన్స్‌ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి తోడు మహేష్ బాబు సన్నిహిత వర్గాల వారు మరియు ఆస్థాన పీఆర్‌ టీం కూడా మురారి ని భారీ ఎత్తున ప్రమోట్‌ చేయడం జరుగుతుంది. కనుక మురారి కనీసం మూడు రోజుల పాటు సందడి చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

కమిటీ కుర్రాళ్లు సినిమాకు వచ్చిన పాజిటివ్‌ బజ్‌ కారణంగా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉండేవి. కానీ మురారి సినిమా వల్ల కచ్చితంగా డ్యామేజీ ఉంటుంది అనేది బాక్సాఫీస్‌ వర్గాల అభిప్రాయం. సినిమాకు సూపర్‌ హిట్‌ టాక్‌ వస్తే తప్ప మురారి ని బీట్ చేసి వసూళ్లు చేసే అవకాశం లేదు అనేది కొందరి అభిప్రాయం. నిహారిక నిర్మిస్తున్న ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించాడు. ఇన్నాళ్లు వెబ్‌ సిరీస్ లు, షార్ట్‌ ఫిల్మ్స్ నిర్మించిన నిహారిక మొదటి సారి సినిమాను నిర్మించింది. నిహారిక మొదటి ప్రయత్నం కు మహేష్ బాబు సినిమా రూపంలో భలే కష్టం వచ్చి పడిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కష్టం నుంచి కమిటీ కుర్రాళ్లు ఎలా బయట పడుతారు అనేది చూడాలి.

Tags:    

Similar News