అవార్డు తీసుకుంటూ అందుకే ఏడ్చాను!

70వ జాతీయ పుర‌స్కారాల వేదిక‌పై ఉత్త‌మ న‌టి గ్రహీత మాన‌సీ ఫ‌రేక్ క‌న్నీళ్లు పెట్టుకున్న వీడియో నెట్టింట వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-10-11 12:29 GMT

70వ జాతీయ పుర‌స్కారాల వేదిక‌పై ఉత్త‌మ న‌టి గ్రహీత మాన‌సీ ఫ‌రేక్ క‌న్నీళ్లు పెట్టుకున్న వీడియో నెట్టింట వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర ప‌తి చేతుల మీదుగా పుర‌స్కారం అందుకుంటోన్న స‌మ‌యంలో...వేదిక‌పై న‌డుచుకుంటూ వెళ్తోన్న స‌మ‌యంలో ఆమె కంట క‌న్నీళ్లు తిరిగాయి. దీంతో గొప్ప అనుభూతిని పోదాల్సిన స‌మ‌యంలో మాన‌సీ ఇలా క‌న్నీరు పెట్టుకుంటుంది? ఏంటి? పెద్ద చ‌ర్చ సాగింది.

తాజాగా ఆ భావోద్వేగానికి కార‌ణాన్ని ఆమె రివీల్ చేసింది. ` రాష్ట్ర ప‌తి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నందుకు నాకెంతో గ‌ర్వంగా ఉంది. అవార్డు తీసుకోవ‌డానికి వేదిక‌పైకి పిలిచిన‌ప్పుడు ఇదంతా నిజ‌మేనా? అని నాకే సందేహం క‌లిగింది. అక్క‌డ స‌న్నివేశాన్ని ఊహించ‌లేక‌పోయాను. వేదిక వ‌ద్ద ఒక్కో మెట్టు ఎక్కుతుంటే? అప్ప‌టి వర‌కూ నా జీవితంలో ఎదుర్కొన్న స‌మ‌స్య‌లు, న‌న్ను ప్రోత్స‌హించే త‌ల్లిదండ్రులు నాభ‌ర్త‌, స్నేహితులు, అభిమానులు ఇలా అంద‌రూ గుర్తొచ్చారు.

ఇంత‌మంది గొప్ప వ్య‌క్తుల మ‌ధ్య అవార్డు అందుకుంటోన్న భావ‌న మాట‌ల‌కు అంద‌నిది. సంతోషంలో క‌న్నీళ్లు వ‌చ్చేసాయి. మాట‌ల్లో చెప్ప‌లేనంత ఆనందం వ‌స్తే శ‌రీరం మ‌న‌కు తెలియ‌కుండానే స్పందిస్తుందేమో. బ‌హుశా వేదిక‌పై అవార్డు తీసుకుంటోన్న స‌మ‌యంలో ఏడ్చిన మొద‌టి న‌టిని నేను అవుతానేమో అని` న‌వ్వుతూ చెప్పింది.

మాన‌సీ ఫ‌రేక్ తొలుత టీవీ న‌టిగా ఎంట్రీ ఇచ్చింది. అక్క‌డ ఎంతో ఫేమ‌స్ అయింది. 2019 వ‌ర‌కూ సీరియ‌ల్స్ చేసింది. ఇదే స‌మ‌యంలో 2012 లో లీలాయి సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఉరి స‌ర్జిక‌ల్స్, గోల్కేరీ, క‌చ్ ఎక్స్ ప్రెస్ స‌హా కొన్నిసినిమాలు చేసింది. వెబ్ సిరీస్ లు షార్ట్ ఫిలిం లు సైతం చేసింది.

Tags:    

Similar News