మానుషి చిల్ల‌ర్‌తో వీర్ ప‌హారియా స్నేహం?

నిన్న ఒక జంట‌... నేడు మ‌రొక జంట‌..! హిందీ మీడియాలో తాజా గాసిప్ ట్రెండింగ్ గా మారింది.

Update: 2024-07-31 07:47 GMT

నిన్న ఒక జంట‌... నేడు మ‌రొక జంట‌..! హిందీ మీడియాలో తాజా గాసిప్ ట్రెండింగ్ గా మారింది. ఈ గాసిప్ ప్ర‌కారం... జాన్వీ క‌పూర్ ప్రియుడిగా పాపుల‌రైన శిఖ‌ర్ ప‌హారియా సోద‌రుడు వీర్ ప‌హారియా ప్ర‌ముఖ క‌థానాయిక‌తో డేటింగ్ చేస్తున్నాడంటూ మీడియాలో క‌థ‌నం రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. వీర్ ప‌హారియా ఇప్పుడు మాజీ మిస్ వ‌ర‌ల్డ్ మానుషి చిల్లర్ తో రిలేష‌న్‌లో ఉన్నార‌ని జాతీయ మీడియా క‌థ‌నాలు ప్ర‌చురించింది. శిఖ‌ర్ ప‌హారియా- వీర్ ప‌హారియా సోద‌రులు ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు సుశీల్ కుమార్ షిండే మ‌న‌వ‌ళ్లు. ఆ ఇద్ద‌రికీ బాలీవుడ్ తో స‌త్సంబంధాలున్నాయి. దీంతో ఈ గాసిప్పుల్లో నిరంత‌రం వారి పేర్లు వినిపిస్తుండ‌డం హాట్ టాపిగ్గా మారింది.

ఓర్రీ యూట్యూబ్ వ్లాగ్ నుండి ఆన్‌లైన్‌లో ఒక వీడియో కనిపించిన తర్వాత వారి డేటింగ్ గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వీడియోలో వీర్ తో పెయిర్ గా క‌నిపించిన‌ మానుషి డ్యాన్స్ చేస్తూ ఎంతో త‌న్మ‌యంలో క‌నిపిస్తోందని ఇండియా టుడే త‌న క‌థ‌నంలో పేర్కొంది. ఇంత‌కీ ఆ ఇద్ద‌రూ ఎక్క‌డ క‌లిసారు? అంటే... మానుషి - వీర్ ఇటీవ‌ల‌ అంబానీల ప్రీవెడ్డింగ్ వేడుక‌లో కలిసి డ్యాన్స్ చేస్తూ క‌నిపించారు.

వీర్.. మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు కొంత కాలంగా పుకార్లు షికార్ చేస్తున్నాయి. సోషల్ మీడియా సంచలనం ఓర్హాన్ అవత్రమణి అకా ఓర్రీ తన వ్లాగ్‌లో వీడియో షేర్ చేయ‌గానే ఇద్దరూ సంబంధంలో ఉన్నారనే ఊహాగానాలకు దారితీసింది. అంతకుముందు అంబానీల ప్రీ వెడ్డింగ్ వేడుకలో కూడా వారు కలిసి కనిపించారు. ఓర్రీ యూట్యూబ్ వ్లాగ్‌లో షేర్ చేసిన‌ ఒక క్లిప్‌లో జాన్వీ కపూర్ కెమెరా కోసం పోజులిస్తుండగా, మానుషి వీర్ భుజంపై తలను వాల్చి అత‌డి చేతులు పట్టుకుని క‌నిపించింది. ఈ క్లిప్ సోషల్ మీడియాలో కనిపించినప్పటి నుండి, ఇది ఇద్దరూ ఒకరినొకరు డేటింగ్ చేస్తున్నారనే పుకార్లకు దారితీసింది. వ్లాగ్‌లోని మరో క్లిప్‌లో జాన్వీ, శిఖర్, వీర్, మానుషి వీరంద‌రినీ ఓర్రీ ఉత్సాహపరుస్తుండగా యాచ్‌లోకి ఎక్కుతూ క‌నిపించారు. మానుషి పడవ నుండి యాచ్‌లోకి అడుగుపెడుతున్నప్పుడు వీర్ చేతిని పట్టుకున్న క్షణాన్ని వీడియో క్యాప్చర్ చేయ‌డంతో ఆ ఇద్ద‌రి న‌డుమా సాన్నిహిత్యం బ‌య‌ట‌ప‌డింది. అంబానీల పెళ్లిలో డ్యాన్సులు... అనంత్- రాధిక మామెరు వేడుక కోసం యాంటిలియాకు రాగా వారితోను ఈ జంట క‌నిపించిందని స‌ద‌రు జాతీయ మీడియా క‌థ‌నం పేర్కొంది.

మానుషి చిల్లర్ వ్యాపారవేత్త నిఖిల్ కామత్‌తో డేటింగ్ చేస్తున్నట్లు గతంలో పుకార్లు వ‌చ్చాయి. మూడు నెలల క్రితం విడిపోయార‌ని ప్ర‌చార‌మైంది. ఈ జంట‌ స్నేహపూర్వకంగా విడిపోయారు.. మరోవైపు వీర్ పహారియా .. అందాల క‌థానాయిక‌ సారా అలీ ఖాన్‌తో డేటింగ్ చేసినట్లు ముంబై మీడియా క‌థ‌నాలు ప్ర‌చురించింది.

వీర్ పహారియా 1965 ఇండియా-పాకిస్తాన్ వైమానిక యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న‌ `స్కై ఫోర్స్' చిత్రంతో తన నటనా రంగ ప్రవేశం చేయనున్నాడు. అక్షయ్ కుమార్ , సారా అలీ ఖాన్ ఇందులో న‌టిస్తున్నారు. ఈ చిత్రం 2అక్టోబర్ 2024 న విడుదల కానుంది.




Tags:    

Similar News