నా సామీ రంగ.. ముందే లేపేశారా..

ఒరిజినల్ అయిన పోరింజు మరియం జోస్ ను తమ ఓటీటీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో తొలిగించిందట. అమెజాన్ ఇండియా, అమెజాన్ యూఎస్.. రెండింటిలోనూ ఈ చిత్రం లేదట.

Update: 2023-08-30 12:14 GMT

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో హీరోలు రీమేక్ ల మీద పడ్డారు. ముఖ్యంగా మెగా హీరోలు చిరంజీవి, పవన్ కల్యాణ్ అచ్చంగా అవే సినిమాలు చేస్తున్నారు. గాడ్ ఫాదర్, భోళాశంకర్, బ్రో.. ఇంకా పలు చిత్రాలు చేశారు. అయితే ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తేడా కొట్టాయి. దీంతో ఇతర స్టార్ హీరోలెవరూ రీమేక్ లు చేయడానికి ధైర్యం చూపరని అంతా అనుకున్నారు.

కానీ అక్కినేని మన్మథుడు నాగార్జున మాత్రం షాక్ ఇచ్చారు. తన కొత్త సినిమాను నా సామిరంగా అంటూ ఫుల్ మాస్ మూడ్ లో కనిపించి అదరగొట్టారు. అయితే ఈ చిత్రం కూడా 2019లో మలయాళ సూపర్ హిట్ గా నిలిచిన పోరింజు మరియం జోస్ అని తెలిసింది. దీంతో అభిమానులు కాస్త షాక్ అయ్యారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం కేరళలో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా రూపొందించారట.

అయితే ఇప్పుడు ఆసక్తికర విషయమేమిటంటే.. ఒరిజినల్ అయిన పోరింజు మరియం జోస్ ను తమ ఓటీటీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో తొలిగించిందట. అమెజాన్ ఇండియా, అమెజాన్ యూఎస్.. రెండింటిలోనూ ఈ చిత్రం లేదట. మరి అమెజాన్ ఎందుకు తొలిగించిందో క్లారిటీ లేదు.అయితే ముందు జాగ్రత్తగా ఏమైనా సంప్రదింపులు, ఒప్పందాలు తర్వాత ఈ ఒరిజినల్ ను ఓటీటీ నుంచి తీసేసి ఉండొచ్చని తెలుస్తోంది. దీనికి ఎంతో కొంత చెల్లించి కూడా ఉంటారన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఆ తర్వాతే సినిమాను అనౌన్స్ చేశారని టాక్ వినిపిస్తోంది.

ఏదేమైనప్పటికీ నాగ్ ఈ రీమేక్ చేసేందుకు రెడీ అవ్వడం ధైర్యమనే చెప్పాలి. అదృష్టం ఏంటంటే ఈ సినిమాలు తెలుగులో ఎక్కువ మంది చూడలేదు కూడా. ఇకపోతే ఈ సినిమాను కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ తెరకెక్కిస్తున్నారు. చిట్టూరి శ్రీనివాస సినిమాను నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకురానున్నారు . చూడాలి మరి గుంటూరు కారం, ఇండియన్ 2 వంటి చిత్రాలకు పోటీగా రానున్న ఈ చిత్రం సినీ ప్రియులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో.

Tags:    

Similar News