గుంటూరు కారం.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిర్మాత

రీసెంట్ ఆదికేశవ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న నాగ వంశీ గుంటూరు కారం సినిమా గురించి మాట్లాడుతూ మరో పాట నెక్స్ట్ వీక్ విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

Update: 2023-11-20 14:31 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న గుంటూరు కారం సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే పోస్టర్స్ తో మాస్ స్టైల్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన మేకర్స్ సాంగ్స్ తో కూడా సినిమాపై అంచనాలను పెంచాలని అనుకుంటున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

పోటీగా మరో ఐదు సినిమాలో ఉన్నప్పటికీ కూడా అందరి ఫోకస్ గుంటూరు కారం సినిమాపైనే ఉంటుంది అని నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ సినిమాలోని మొదటి సాంగ్ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. థమన్ స్వరపరిచిన ధమ్ మసాలా.. అనే పాట మాస్ ఆడియెన్స్ ను బాగానే ఓ ఆకట్టుకుంది కానీ హై రేంజ్ లో ఈ సాంగ్ ఎక్కువగా వైరల్ అవ్వలేదు.

కానీ ఈ సినిమాలో ఇంకా మరో మూడు మాటలు ఉన్నాయి అని నిర్మాత నాగ వంశీ తెలియజేశారు. రీసెంట్ ఆదికేశవ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న నాగ వంశీ గుంటూరు కారం సినిమా గురించి మాట్లాడుతూ మరో పాట నెక్స్ట్ వీక్ విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా తర్వాత రాబోయే మూడు పాటలు కూడా ఏడాది పాటు నాన్ స్టాప్ గా అందరు వినేలా ఉంటాయి అని వివరణ ఇచ్చారు.

కాబట్టి తర్వాత వచ్చే సాంగ్స్ ఈ సినిమాకు ఎంత కీలకంగా ఉన్నాయో చెప్పవచ్చు. ఇక త్రివిక్రమ్ తన సినిమాకు సంబంధించిన మ్యూజిక్ విషయంలో అయితే ఎప్పుడు నిరాశ పరచలేదు. సినిమాలు ప్లాప్ అయినా కూడా ఒక ట్రెండ్ సెట్ చేశాయి. ఇక ఇప్పుడు గుంటూరు కారంలో విభిన్నమైన విధమైన తరహాలో మెలోడీ సాంగ్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో శ్రీలీల మహేష్ బాబుకు జోడిగా నటిస్తుండగా మీనాక్షి చౌదరి మరొక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఇక షూటింగ్ కు బ్రేక్స్ లేకుండా చాలా రోజులుగా కొనసాగిస్తున్నారు. సంక్రాంతికి డేట్ ఫిక్స్ చేసుకోవడంతో డిసెంబర్ లోపు షూటింగ్ పనులు అన్నిటినీ కూడా ఫినిష్ చేసుకోవాలని అనుకుంటున్నారు. మరి గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News