నందమూరి వారసులంతా సీక్వెల్స్-ప్రీక్వెల్!
నందమూరి వారసులుంతా సీక్వెల్స్..ప్రీకెల్ అంటూ బిజీగా ఉన్నారా? బాలయ్య నుంచి ఆయన వారసుడు వరకూ అంతే అదే పనిలో ఉన్నారా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది.
నందమూరి వారసులుంతా సీక్వెల్స్..ప్రీకెల్ అంటూ బిజీగా ఉన్నారా? బాలయ్య నుంచి ఆయన వారసుడు వరకూ అంతే అదే పనిలో ఉన్నారా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ-2` శివ తాండవం తెరకెక్కుతోంది. ఇది `అఖండ` చిత్రానికి సీక్వెల్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న బాలయ్య తొలి పాన్ ఇండియా చిత్రమిది.
ఈ సినిమాతో బాలయ్య పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయమంటున్నారంతా. ఇక నందమూరి కల్యాణ్ రామ్ వరుసగా 20, 21, 22 చిత్రాల్ని ప్రకటించాడు. అందులో 21 వ చిత్రం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో చేస్తున్నాడు. నెంబర్ 20, 22 అనౌన్స్ మెంట్ అయ్యాయి. అందులో ఒకటి` బింబిసార` ప్రీక్వెల్. వశిష్ట తెరకెక్కించిన `బింబిసార` ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. కొంత గ్యాప్ తర్వాత కల్యాణ్ రామ్ కి మరో భారీ హిట్ ఇచ్చిన చిత్రమిది.
దీంతో ఇప్పుడీ సినిమా ప్రీక్వెల్ ప్లాన్ చేసారు. వశిష్ట `విశ్వంభర` నుంచి రిలీజ్ అవ్వగానే ప్రీక్వెల్ పనుల్లోనే నిమగ్నమవుతారు. ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్ రెగ్యలర్ గా వశిష్టకు టచ్ లో ఉంటి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకుంటున్నారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా సీక్వెల్ లోనే నటిస్తున్నాడు. బాలీవుడ్ లో `వార్ 2`లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి తెరను పంచుకుంటున్నాడు.
`వార్` చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రమిది. బాలీవుడ్ లో తారక్ డెబ్యూ చిత్రమిదే. ఇక బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా సీక్వెల్ తోనే టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య నటించిన `ఆదిత్య 369` చిత్రానికి సీక్వెల్ గా `ఆదిత్య 999`ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి స్వయంగా బాలయ్య కథ రాసారు. ఆయనే దర్శకత్వం కూడా వహిస్తారని సమాచారం. ఇదే సినిమాతో మోక్షజ్ఞని లాంచ్ చేయాలని బాలయ్య పట్టు మీద ఉన్నారు. బాలయ్య ప్రీ అయిన అనంతరం ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని తెలుస్తుంది.