హేమ కమిటీ రిపోర్ట్‌ తో నా హృదయం బద్దలైంది : నాని

మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తరపు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో జస్టిస్ హేమ కమిటీ ఏర్పడింది.

Update: 2024-08-24 09:21 GMT

మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తరపు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో జస్టిస్ హేమ కమిటీ ఏర్పడింది. ఇటీవల హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ లని విషయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సినిమా ఇండస్ట్రీలో మహిళలు అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వారిని ఇండస్ట్రీలోని సీనియర్స్ ముఖ్యంగా పెద్ద స్టార్స్ అంటూ చెప్పుకుంటున్న వారు చాలా ఇబ్బందులు పెడుతున్నారని ఆ కమిటీ రిపోర్ట్‌ లో పేర్కొనడం జరిగింది. హేమ కమిటీ రిపోర్ట్‌ పై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు.

తాజాగా ఆ కమిటీ రిపోర్ట్‌ పై తెలుగు యంగ్ స్టార్‌ హీరో నాని స్పందించాడు. ఆయన మాట్లాడుతూ... హేమ కమిటీ రిపోర్ట్‌ లోని విషయాలు తెలిసి నా హృదయం బద్దలైంది. అయితే నా సినిమా షూటింగ్‌ సమయంలో, నా చుట్టు పక్కల ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదు. పెద్ద సినిమాలకు అలాంటి సంఘటనలు ఎక్కువ జరగవని నేను అనుకుంటున్నాను. పెద్ద సినిమాల షూటింగ్ సమయంలో ప్రతి ఒక్కరూ చాలా కష్టపడుతారు. ఆ సమయంలో యూనిట్‌ సభ్యులు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటారు. నా టీం మెంబర్స్‌ ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాంటి ఘటనలు ఎక్కువ ఉండవని నేను భావిస్తున్నాను. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా కచ్చితంగా తప్పే. ఇలాంటి సంఘటనల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని హేమ కమిటీ రిపోర్ట్‌ పై నాని స్పందించాడు. ఇంకా పలువురు మలయాళ స్టార్స్ కూడా హేమ కమిటీ రిపోర్ట్‌ పై స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు కూడా మహిళల పట్ల గౌరవంతో ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఆడవారు ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వారికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది అన్నారు.

నాని సినిమాల విషయానికి వస్తే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే వారంలోనే ఈ సినిమా విడుదల అవ్వబోతుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా దేశం మొత్తం కూడా నాని చుట్టేస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఒక వైపు సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటూ మరో వైపు ఇలా హేమ కమిటీ పై నాని స్పందించడం అభినందనీయం అంటూ నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. టాలీవుడ్‌ స్టార్స్ మరింత మంది హేమ కమిటీ రిపోర్ట్‌ పై స్పందించాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News