నిత్య మీనన్.. ఒకటే మాట.. ఒకటే బాణం..!

ఈమధ్యనే జాతీయ అవార్డ్ అందుకున్న నిత్యా మీనన్ తన సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకుంది.

Update: 2024-10-22 09:30 GMT

మలయాళ భామ నిత్యా మీనన్ సౌత్ సినిమాలకు సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. ఆమె నటనతో సౌత్ సినీ ఆడియన్స్ ని తన అభిమానులుగా మార్చేసుకుంది. తెలుగులో అయితే నిత్యా మీనన్ కు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. నానితో అలా మొదలైంది సినిమాతో మొదలైన నిత్య టాలీవుడ్ కెరీర్ కొన్ని ప్రత్యేకమైన సినిమాలు అందించేలా చేసింది. ఐతే తెలుగుతో పాటు తమిళ్ లో కూడా నిత్య తన స్పెషాలిటీ చూపిస్తూ వచ్చారు. ఈమధ్యనే ఆమెకు తిరుచిత్రంబళం సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చింది.

ఈమధ్యనే జాతీయ అవార్డ్ అందుకున్న నిత్యా మీనన్ తన సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకుంది. ఇక అదే క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన సినిమా సెలక్షన్ గురించి మరోసారి గట్టిగా చెప్పింది అమ్మడు. తనకు నచ్చిన కథ వస్తే చేస్తా తప్ప కమర్షియల్ సినిమాల్లో నటించేది లేదని కెరీర్ మొదటి నుంచి చెబుతున్న నిత్యా మీనన్ ఇప్పటికీ అదే మాట మీద ఉంది. అందుకే ఆమె కెరీర్ మధ్యలో కొంత గ్యాప్ వచ్చేలా చేసింది.

కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తా కమర్షియల్ మసాలా సినిమాల్లో నటించేది లేదని లేటెస్ట్ ఇంటర్వ్యూలో మరోసారి స్పష్టం చేసింది నిత్యా మీనన్. అభినయంలో ఒక్కో హీరోయిన్ కి ఒక్కో స్టైల్ ఉంటుంది. నిత్యా చేసిన పాత్రల్లో సహజత్వం ఉట్టి పడుతుంది. అందుకే ఆమె సౌత్ సినీ ప్రియులకు ప్రత్యేకమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఐతే తనకు నచ్చిన కథలు మాత్రమే చేస్తానని ఘంటాపథంగా చెబుతుంది నిత్యా మీనన్.

చేసిన ప్రతి పాత్రకు గుర్తింపు రాలేదని ఎప్పుడు కోరుకోలేదని అంటున్న నిత్యా మీనన్ తాను చేసిన పాత్ర సంతోషాన్ని ఇస్తే చాలని అంటుంది. ఐతే నేషనల్ అవార్డ్ వస్తుందని అసలు ఊహించలేదని చెప్పుకొచ్చింది. మంచి పాత్ర అయితే చిన్న సినిమా అయినా చేస్తా అది మొదలవ్వడం కోసం ఎదురుచూస్తా కానీ మసాలా సినిమాలకు మాత్రం అసలు ఛాన్స్ లేదని అంటుంది నిత్యా మీనన్. మొత్తానికి జాతీయ అవార్డ్ నిత్యా మీనన్ లో కాన్ఫిడెన్స్ ని ఇంకాస్త పెంచిందని చెప్పొచ్చు.

ప్రస్తుతం నిత్యా మీనన్ గోల్డెన్ వీసా సినిమాలో నటిస్తుంది. దీనితో పాటు పాండిరాజ్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో వస్తున్న సినిమాలో కూడా నిత్యా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.

Tags:    

Similar News