వీడియో : ప్రభాస్‌ కామెడీతో 'మత్తు వదలరా' కి డబుల్‌...!

శ్రీ సింహా, సత్య, ఫరియా అబ్దుల్లా ముఖ్య పాత్రల్లో నటించిన 'మత్తు వదలరా 2' సినిమా విడుదలకు సిద్ధం అయింది.

Update: 2024-09-09 07:50 GMT

శ్రీ సింహా, సత్య, ఫరియా అబ్దుల్లా ముఖ్య పాత్రల్లో నటించిన 'మత్తు వదలరా 2' సినిమా విడుదలకు సిద్ధం అయింది. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. మత్తు వదలరా మొదటి పార్ట్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సీక్వెల్‌ కి విడుదలకు ముందే పాజిటివ్ బజ్‌ క్రియేట్‌ అయింది. సీక్వెల్‌ టీజర్‌ తోనే అంచనాలు పెంచారు. తాజాగా ట్రైలర్ లాంచ్ జరిగింది. రెబల్‌ స్టార్‌ ప్రభాస్ చేతుల మీదుగా మత్తు వదలరా 2 సినిమా ట్రైలర్ లాంచ్ అనగానే అంచనాలు, ఆసక్తి పెరిగింది.

సాధారణంగా స్టార్స్ చేతుల మీదుగా ట్రైలర్‌ లాంచ్‌ చేయించడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చాలా విభిన్నంగా జరిగింది. శ్రీ సింహా, సత్య, ఫరియా అబ్దుల్లా లతో కలిసి ప్రభాస్ ట్రైలర్ లాంచ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ కామెడీ చేస్తే ఎలా ఉంటుందో ఈ నాలుగు నిమిషాల వీడియోలో చూడవచ్చు. ప్రభాస్‌ వంటి స్టార్‌ తో కామెడీ చేస్తూ ట్రైలర్‌ ను లాంచ్‌ చేయించే కాన్సెప్ట్‌ బాగుంది. ప్రభాస్‌ తో సత్య ఓవర్‌ యాక్షన్‌, ఫరియా పాట పాడుతాను అనడం, మనం మల్టీస్టారర్ చేద్దాం అంటూ శ్రీ సింహా అనడంతో కామెడీ బాగా పండింది.

ప్రభాస్‌ ఎంట్రీతోనే నవ్వులు పూయించే విధంగా వీడియోను డిజైన్‌ చేయడం జరిగింది. ఈ నాలుగు నిమిషాల వీడియో ఆసాంతం నవ్వు తెప్పించింది. ప్రభాస్ కామెడీ యాంగిల్ ను కూడా ఈ వీడియోలో చూడవచ్చు. తాము చేసిన కామెడీ సినిమాను ఇలా ప్రమోట్‌ చేయాలని భావించిన మేకర్స్‌ అక్కడ ఉన్నది ప్రభాస్ అవ్వడం వల్ల డబుల్‌ సక్సెస్ అయ్యారని చెప్పాలి. సినిమాకు విపరీతమైన బజ్‌ క్రియేట్ చేయడంలో కచ్చితంగా ప్రభాస్ రిలీజ్ చేసిన ట్రైలర్ తో పాటు, ఆయన ట్రైలర్‌ లాంచ్ చేసే సందర్భంగా జరిగిన సందడి నాలుగు నిమిషాల వీడియో కీలకం అనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం ప్రభాస్‌ రాజా సాబ్ సినిమాతో పాటు సలార్‌ 2, కల్కి 2, ఫౌజీ, స్పిరిట్ సినిమాలను లైన్‌ లో పెట్టాడు. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ప్రభాస్ టైం ఒక చిన్న సినిమా కోసం టైం స్పెండ్ చేయడం మంచి పరిణామం. ఆయన భాగస్వామ్యంతో మత్తు వదలరా సినిమా క్రేజ్‌ డబుల్‌ అవ్వడంతో పాటు, అన్ని చోట్ల సినిమా గురించి తెలిసింది. ప్రభాస్ తో ట్రైలర్ లాంచ్ చేయించాం అన్నట్టుగా కాకుండా దాదాపు నాలుగు నిమిషాల్లోనే ఆయనతో అద్భుతమైన కంటెంట్‌ ను క్రియేట్‌ చేసి విడుదల చేయడం ద్వారా సినిమాకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. మత్తు వదలరా 2 టీం చేసిన ఈ ప్రయత్నం ఎంతో మందికి ఆదర్శంగా నిలవబోతోంది.

Full View
Tags:    

Similar News