30 కోట్లతో ముంబైలో ఫ్లాట్ కొన్న స్టార్ హీరో

ముంబైలో ప‌లువురు సౌతిండియన్ స్టార్లు సొంత అపార్ట్ మెంట్లు కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-18 05:51 GMT

ముంబైలో ప‌లువురు సౌతిండియన్ స్టార్లు సొంత అపార్ట్ మెంట్లు కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్-ఉపాస‌న జంట‌కు సొంత అపార్ట్ మెంట్ తో పాటు, సొంత ఆఫీస్ కూడా ఉంద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇప్పుడు ప్రముఖ మలయాళ నటుడు, ద‌ర్శ‌కుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో ఖరీదైన డూప్లెక్స్ హౌస్‌ను కొనుగోలు చేశారు. భారతదేశ ఆర్థిక వినోద రాజధానిలో అత‌డికి ఇది రెండవ ఆస్తి.

తాజా స‌మాచారం మేర‌కు.. పృథ్వీరాజ్ సుమారు 2971 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 30.60 కోట్ల విలువైన కొత్త డ్యూప్లెక్స్ ను సొంతం చేసుకున్నారు. డ్యూప్లెక్స్‌లో నాలుగు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. 30,000 రుసుముతో పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్ పేరుతో ఆస్తిని రిజిస్టర్ చేయగా పృథ్వీరాజ్ రూ.1.84 కోట్ల స్టాంప్ డ్యూటీని చెల్లించినట్లు సమాచారం. పాలి హిల్ లో ఇప్ప‌టికే అత‌డికి సొంత అపార్ట్ మెంట్ ఉంది. అక్క‌డ‌ పలువురు బాలీవుడ్ తారలకు పృథ్వీరాజ్ పొరుగువాడు అయ్యాడు.

గతంలో పృథ్వీరాజ్ అతడి భార్య సుప్రియ ఇదే పాళిహిల్ (బాంద్రా) ప్రాంతంలో రూ. 17 కోట్ల ఖ‌రీదైన‌ ఇంటిని కొనుగోలు చేశారు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... పృథ్వీరాజ్ సలార్ - ఆదుజీవితం చిత్రాలలో తనదైన అద్భుత‌ నటనతో ఆక‌ట్టుకున్నాడు. త‌దుప‌రి స‌లార్ 2లోను క‌నిపిస్తాడు. విలయత్ బుద్ధ, ఎవరు, L2: ఎంపురాన్ చిత్రాల్లోను న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవ‌లే అక్ష‌య్- టైగ‌ర్ న‌టించిన బ‌డే మియాన్ చోటే మియాన్ లో పృథ్వీరాజ్ విల‌న్ గా న‌టించాడు. త‌దుప‌రి ప‌లు హిందీ చిత్రాల‌లో న‌టించ‌నున్నాడని స‌మాచారం.

Tags:    

Similar News