పుష్ప-2.. కొత్త మ్యాటర్ ఏంటంటే?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే.

Update: 2024-10-03 09:49 GMT

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. పార్ట్-1 పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అందరి దృష్టి సీక్వెల్ పై పడింది. అదే సమయంలో మేకర్స్ కూడా ఎంతో జాగ్రత్తగా.. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని మరీ షూట్ చేస్తున్నారు. కొన్ని సీన్స్ రీషూట్ కూడా చేస్తున్నారు. ఈ విషయాన్ని రీసెంట్ గా దర్శకుడు సుకుమార్ స్వయంగా ఓ ఈవెంట్ లో తెలిపారు. మంచి అవుట్ పుట్ ఇచ్చేందుకు కష్టపడుతున్నట్లు చెప్పారు.

అయితే డిసెంబర్ 6వ తేదీన పుష్ప-2 మూవీ రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే పలుమార్లు అనౌన్స్ చేశారు. అనుకున్న తేదీకి కచ్చితంగా సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. కౌంట్ డౌన్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండగా.. త్వరలో మేకర్స్ గుమ్మడికాయ కొట్టనున్నారు. కొంత టాకీ పార్ట్ తో పాటు స్పెషల్ సాంగ్ మాత్రమే పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఒకే ఒక్క షూటింగ్ షెడ్యూల్ మిగిలి ఉందని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే నేటి నుంచి కొత్త షెడ్యూల్ ను మేకర్స్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్.. క్లైమాక్స్ కోసం రెండు వెర్షన్లు షూట్ చేసినట్లు సమాచారం. ఇప్పుడు మూడో వెర్షన్ ను చిత్రీకరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అది కూడా చిత్ర యూనిట్ లోని అతి తక్కువ మంది ఆధ్వర్యంలో తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అత్యంత గోప్యంగా క్లైమాక్స్ కొత్త వెర్షన్ షూటింగ్ జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది.

అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్ మధ్య సీన్స్ తో ఉండే పుష్ప-2 క్లైమాక్స్‌.. మూవీ లవర్స్ తోపాటు బన్నీ ఫ్యాన్స్ కు మంచి కిక్‌ ను ఇవ్వబోతోందని తెలుస్తోంది. సినిమాకు ఆ సీన్స్.. మేజర్‌ ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. క్లైమాక్స్ తర్వాత స్పెషల్ సాంగ్ ను షూట్ చేయనున్న మేకర్స్.. మరో పది రోజుల్లో మొత్తం షూటింగ్ ను ముగించనున్నారని వినికిడి. అందుకోసం అల్లు అర్జున్, సుకుమార్ ఫుల్ ఎనర్జిటిక్ గా పనిచేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇక సినిమా విషయానికొస్తే.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న శ్రీవల్లి 2.0గా అలరించనున్నారు. సునీల్, అనసూయ సహా పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. సీక్వెల్ కు కూడా సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న పుష్ప-2 నుంచి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ వేరే లెవెల్ లో రెస్పాన్స్ అందుకుంది. మరి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News