ర‌కుల్ థాయ్ లాండ్ బాష్ లో ఆ ఇద్ద‌రి హంగామా!

రకుల్ ప్రీత్ జాకీ థాయ్‌లాండ్‌లో తమ సన్నిహితుల కోసం గ్రాండ్ బాష్ నిర్వహించారు. థాయ్‌లాండ్‌లో జరిగిన బాష్‌కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Update: 2024-02-05 07:30 GMT

ప్ర‌స్తుతం ర‌కుల్ ప్రీత్ సింగ్ వివాహం అనే ఉత్సాహంలో మునిగి తేలుతోంది. మ‌న‌సిచ్చిన చెలికాడుతో జీవితాన్ని పంచుకునే క్ష‌ణాల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. జాకీ భ‌గ్నానీతో ఫిబ్ర‌వ‌రి 21ని గోవాలో నిరాడంబ‌రంగా వివాహం జ‌రుగుతుంది. ఈ వేడుక కేవ‌లం కుటుంబ స‌భ్య‌లులు.. సన్నిహి తులు.అతికొద్ది మంది స్నేహితుల సమక్షంలో జ‌రుగుతుంది.

పెళ్లి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌టంతో ఆ రెండు కుటుంబాలు ఆ ప‌నుల్లోనే బిజీగా ఉన్నాయి. పెళ్లికి అవ‌స‌ర‌మైన షాపింగ్ ప్రోస‌స్ లో భాగంగా వ‌దువ రూలిద్ద‌రు బిజీబిజీగా ఉన్నారు. మ‌రోవైపు ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ ని ఆస్వాదిస్తున్నారు. రకుల్ ప్రీత్ జాకీ థాయ్‌లాండ్‌లో తమ సన్నిహితుల కోసం గ్రాండ్ బాష్ నిర్వహించారు. థాయ్‌లాండ్‌లో జరిగిన బాష్‌కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ఈ వేడుక ఇద్ద‌రు స‌మ‌క్షంలో జ‌ర‌గ‌డంతో కేవ‌లం వాళ్లిద్ద‌ర‌కి క్లోజ్ గా ఉన్న సేహితులు మాత్ర‌మే హాజ‌ర‌వుతార‌ని అంతా గెస్ చేసారు. కానీ ఈ వేడుక‌కు టాలీవుడ్ నుంచి కూడా సెల‌బ్రిటీలు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. మంచు లక్ష్మి.. ప్రగ్యా జైస్వాల్ కూడా ఈ లిస్ట్ లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ర‌కుల్ వీరిద్ద‌ర్నీ ప్ర‌త్యేకంగా ఆహ్వానిచ‌డంతో థాయ్ లాండ్ వ‌ర‌కూ వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ర‌కుల్-మంచు ల‌క్ష్మి మ‌ధ్య ఇంత గొప్ప స్నేహం ఉందా? అన్న‌ది ఇప్పుడే తెలుస్తుంది.

కెరీర్ ఆరంభంలోనే ర‌కుల్ ప్రీత్ సింగ్ మంచు మ‌నోజ్ హీరోగా న‌టించిన ఓ చిత్రంలో న‌టించింది. ఆ స‌మయంలోనే ల‌క్ష్మీతో ప‌రిచయం..స్నేహం మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. అప్ప‌టి నుంచి ఇద్ద‌రి మ‌ధ్య బాండింగ్ కొన‌సాగుతుంది. ర‌కుల్ టాలీవుడ్ కి దూర‌మై బాలీవుడ్ కి వెళ్లిపోయినా ల‌క్ష్మీతో మాత్రం అదే ప్రెండ్ షిప్ ని కొన‌సాగిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో మంచు ల‌క్ష్మీ హ‌డావుడి పెళ్లిలో ఇంకా గ్రాండ్ గా ఉంటుంద‌ని చెప్పొచ్చు.

Tags:    

Similar News