'యానిమల్‌' లో ఇంటిమేట్ సీన్‌ గురించి త్రిప్తి!

రణబీర్ కపూర్‌ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో రూపొంది ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్‌ సినిమా గురించి గల్లీ మీడియా నుంచి ఢిల్లీ వరకు చర్చ జరుగుతోంది.

Update: 2023-12-07 10:56 GMT

రణబీర్ కపూర్‌ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో రూపొంది ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్‌ సినిమా గురించి గల్లీ మీడియా నుంచి ఢిల్లీ వరకు చర్చ జరుగుతోంది. చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం ఇప్పటికే ఈ సినిమా రూ.500 కోట్ల వసూళ్లు క్రాస్ చేసి, లాంగ్ రన్‌ లో వెయ్యి కోట్ల వసూళ్ల లక్ష్యంతో దూసుకు పోతున్నట్లుగా తెలుస్తోంది.

యానిమల్‌ సినిమాలో రణబీర్‌ కపూర్‌, రష్మిక మందన్నల తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ త్రిప్తి డిమ్రి. ఈ అమ్మడు సౌత్‌ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ హిందీలో ఈమె చేసిన వెబ్‌ సిరీస్ కు మంచి టాక్ దక్కింది. యానిమల్‌ లో ఈమె చేసిన ఇంటిమేట్ సన్నివేశాలు యూత్‌ ఆడియన్స్ కి మతి పోగొడుతున్నాయి అనే టాక్‌ ఉంది.

తాజాగా త్రిప్తి డిమ్రి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యానిమల్‌ సక్సెస్ పై సంతోషం వ్యక్తం చేసింది. ఇంకా ఆమె ఇంటిమేట్ సన్నివేశాల గురించి కూడా స్పందించింది. త్రిప్తి మాట్లాడుతూ... సినిమా కోసం దర్శకుడు సందీప్‌ వంగ నన్ను సంప్రదించిన సమయంలోనే రణబీర్‌ తో రొమాంటిక్ సన్నివేశం ఉంటుందని నాకు క్లారిటీగా చెప్పాడు.

కథ మరియు స్క్రీన్‌ ప్లే లో ఇంటిమేట్‌ సన్నివేశం యొక్క ప్రాముఖ్యతను గుర్తించాను కనుకే నేను ఆ సన్నివేశం చేసేందుకు ఓకే చెప్పాను. ఇక ఆ సన్నివేశం షూటింగ్‌ సమయంలో నటీ నటులు, సినిమాటోగ్రాఫర్‌ మరియు దర్శకుడు మాత్రమే ఉన్నారు. ఏ విషయంలో కూడా ఇబ్బంది లేకుండా సందీప్ వంగ చూసుకున్నారని త్రిప్తి పేర్కొంది.

యానిమల్ సినిమా విడుదల అయిన వెంటనే రవితేజ సినిమాలో ఈమె నటించబోతుందని వార్తలు వచ్చాయి. ఆ విషయం నిజం కాదని తేలింది. ఇక సౌత్‌ లో స్టార్‌ హీరోల సినిమాల్లో ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తానని త్రిప్తి పేర్కొంది. ఈ అమ్మడి అందం, మరియు నటన ప్రతిభ కి కచ్చితంగా ముందు ముందు సౌత్‌ లో మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News