మరో స్టార్‌ క్లాతింగ్ బ్రాండ్ షురూ

ఈ మధ్య కాలంలో హీరోలు కేవలం నటనపై మాత్రమే కాకుండా వేరు వేరు రంగాలపై దృష్టి పెడుతున్నారు.

Update: 2024-09-28 11:01 GMT

ఈ మధ్య కాలంలో హీరోలు కేవలం నటనపై మాత్రమే కాకుండా వేరు వేరు రంగాలపై దృష్టి పెడుతున్నారు. కేవలం నటించడం ద్వారా డబ్బు సంపాదించడం మాత్రమే కాకుండా సాధ్యం అయినంత ఎక్కువగా డబ్బు వెనకేసుకునేందుకు గాను తమ సొంత బ్రాండ్ ఇమేజ్ ను వాడుకుని వ్యాపారాలు చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. సోషల్‌ మీడియాలో, ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో తమకు ఉన్న ఫాలోయింగ్‌ నేపథ్యంలో ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుందనే ఉద్దేశ్యంతో ఈమధ్య కాలంలో చాలా మంది ఫుడ్ బిజినెస్, క్లాతింగ్ బిజినెస్‌ ఇంకా ఇతర బిజినెస్ ల్లో ఎంట్రీ ఇస్తున్నారు.

టాలీవుడ్‌ స్టార్‌ విజయ్ దేవరకొండతో పాటు పలువురు స్టార్స్‌ క్లాతింగ్ బిజినెస్ ను చేస్తున్న విషయం తెల్సిందే. వారికంటూ సొంత బ్రాండ్‌ ను ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నారు. సినిమాల్లో వచ్చిన గుర్తింపును ఇలా వ్యాపారాలకు వాడుకుంటున్న వారు చాలా వరకు హిట్ అయ్యారు. ఇప్పుడు ఈ క్లాతింగ్‌ బిజినెస్ లోకి బాలీవుడ్‌ స్టార్‌ నటుడు రణబీర్‌ కపూర్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే బాలీవుడ్‌ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో చోటు దక్కించుకోవడంతో పాటు, అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల్లో ఒకడిగా రణబీర్‌ కపూర్ ఉన్నాడు.

రణబీర్‌ కపూర్ తనకు ఉన్న క్రేజ్‌ ను పెట్టుబడిగా పెట్టి ARKS అనే క్లాతింగ్ బ్రాండ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ పేరుతో సోషల్‌ మీడియాలో ఖాతాలు తెరిచి పోస్ట్‌ లు చేస్తున్నారు. రణబీర్‌ కపూర్‌ భార్య ఆలియా భట్ ఈ క్లాతింగ్ బ్రాండ్ ను పరిచయం చేయడం జరిగింది. రణబీర్ కపూర్ తల్లి సైతం ఈ బ్రాండ్‌ ను ప్రమోట్ చేస్తూ తన సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం పై షేర్‌ చేశారు. రణబీర్‌ కి సోషల్‌ మీడియా లో ఖాతాలు ఉండవు. కనుక ఆయన తరపున భార్య, తల్లి ఈ బ్రాండ్ ను ప్రమోట్‌ చేస్తున్నారు. రణబీర్‌ కపూర్ పేరు కనిపిస్తే చాలు మార్కెట్‌ లో ఆ డ్రెస్ లు హాట్‌ కేకుల మాదిరిగా అమ్ముడు పోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇటీవల రణబీర్ కపూర్‌ యానిమల్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆయన నుంచి రాబోతున్న ప్రతి సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రస్తుతం ఆయన రామాయణం సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయింది. మూడు నాలుగు పార్ట్‌ లుగా రామాయణం వస్తుందనే టాక్‌ వినిపిస్తుంది. మొదటి పార్ట్ 2025 లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. రామాయణం లో రాముడిగా రణబీర్‌ కపూర్ నటిస్తూ ఉంటే, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నాడు, రావణుడిగా యశ్‌ కనిపించబోతున్నాడు. పరశురాముడు పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు అనే పుకార్లు సైతం ఈ మధ్య వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News