సమంత ప్రాజెక్ట్.. రష్మిక చేతిలోకి..?

అయితే, ఆమె వదలుకున్న ఓ సినిమా ఇప్పుడు రష్మిక చేతిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. చి.ల,సౌ అనే సినిమాతో నటుడు రాహుల్ రవీంద్రన్ తొలిసారి దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే.

Update: 2023-09-25 14:33 GMT

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా ఖుషీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో ఆశలుపెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటే, మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ విడుదల సమయంలోనే ఆమె తన చికిత్స కోసం అమెరికా వెళ్లిపోయింది. ఈ చికిత్స నేపథ్యంలో సమంత చాలా ఆఫర్లు వదులుకుంది.

కొన్ని సినిమాలు ముందుగా ఒప్పుకున్నా, వాటిని మళ్లీ చేయను అని దర్శక నిర్మాతలకు చెప్పేసింది. తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి ఇచ్చేసిందనే టాక్. అయితే, ఆమె వదలుకున్న ఓ సినిమా ఇప్పుడు రష్మిక చేతిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. చి.ల,సౌ అనే సినిమాతో నటుడు రాహుల్ రవీంద్రన్ తొలిసారి దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే.

ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది, ఈ క్రమంలోనే వెంటనే రెండో సినిమా నాగార్జున తో కలిసి మన్మథుడు 2 చేశాడు. అయితే, అది ప్లాప్ అయ్యింది. మూవీ మేకింగ్ పై కూడా చాలా విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన మళ్లీ ఇంకో సినిమా చేయలేదు. అయితే, ఇప్పుడు ఆయన మరోసారి దర్శకుడుగా సత్తా చాటాలని అనుకుంటున్నాడట. ఆ మూవీలో రష్మిక ను హీరోయిన్ గా తీసుకుంటున్నారు. కథ వినగానే రష్మికకు బాగా నచ్చిందట. వెంటనే ఒప్పేసుకుందట.

అయితే, రాహుల్ మొదట ఈ కథను సమంతకు వినిపించారట. ఆమె కూడా చేయడానికి అంగీకరించింది. మొదటి నుంచి రాహుల్, ఆయన భార్య చిన్మయితో సమంతకు మంచి స్నేహం ఉండటంతో, ఈ సినిమా ఆమే చేద్దాం అనుకుంది. కానీ, తన అనారోగ్యం దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట. దీంతో, సమంత ప్లేస్ లోకి ఇప్పుడు రష్మిక వచ్చింది.

ఇక, రష్మిక ఈ ప్రాజెక్టు కోసం త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టనుందట. ఇదిలా ఉండగా, రష్మిక చేతిలో ఇప్పటికే రెండు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. యానిమల్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది, మరో మూవీ పుష్ప2 వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది. ఈ రెండు సినిమాలపై రష్మిక చాలా ఎక్కువ ఆశలు పెట్టుకొని ఉండటం విశేషం.

Tags:    

Similar News