డబ్బు కోసం ఇంత నీచమా.. సాయిపల్లవి సీరియస్!

సోషల్ మీడియా వేదికగా, ఈ రూమర్స్ కి చెక్ పెట్టారు. తాను రూమర్స్ ని పెద్దగా పట్టించుకోనని, కానీ, ఈ విషయంలో తన ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేశారని, అందుకే స్పందిస్తున్నానని ఆమె క్లారిటీ ఇచ్చారు.

Update: 2023-09-22 13:37 GMT

సెలబ్రెటీల పర్సనల్ విషయాలపై అందరూ ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా వారి పెళ్లి విషయాలపై అయితే, ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఇక, హీరోయిన్ల పెళ్లి అంటే మరింత ఇంట్రస్ట్ చూపిస్తారు. పెళ్లి కాకపోయినా అయిపోయింది అని, భర్త ఇతనే అంటూ చాలా మంది పై ఇప్పటి వరకు చాలా వార్తలు వచ్చాయి. రీసెంట్ గా సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవిని కూడా ఈ జాబితాలో చేర్చారు. సాయి పల్లవికి పెళ్లి అయిపోయింది అంటూ, ఆమె మెడలో దండ వేసుకున్న ఓ ఫోటో షేర్ చేయడం మొదలుపెట్టారు.

అయితే, అది పెళ్లి ఫోటో కాదని మూవీ పూజా కార్యక్రమంలో భాగంగా దిగిన ఫోటో అని ఇప్పటికే డైరెక్టర్ వేణు ఊడుగుల క్లారిటీ ఇచ్చారు. ఆయన క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రచారానికి పులిస్టాప్ పడలేదు. దీంతో, ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే సాయి పల్లవి సైతం ఈ విషయం పై స్పందించాల్సి వచ్చింది. నిజానికి, తనపై ఎలాంటి రూమార్స్ వచ్చినా సాయి పల్లవి పెద్దగా పట్టించుకోదు. కానీ, ఈ పెళ్లి అనే రూమర్ క్రియేట్ చేసి ఆమె కుటుంబాన్ని కూడా ఈ విషయంలో కి లాగడంతో, ఆమె స్పందించక తప్పలేదు.

సోషల్ మీడియా వేదికగా, ఈ రూమర్స్ కి చెక్ పెట్టారు. తాను రూమర్స్ ని పెద్దగా పట్టించుకోనని, కానీ, ఈ విషయంలో తన ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేశారని, అందుకే స్పందిస్తున్నానని ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను చేయబోతున్న కొత్త సినిమా పూజా కార్యక్రమంలో దిగిన ఫోటోని క్రాప్ చేసి, పెళ్లి అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని ఆమె అన్నారు.

డబ్బు కోసం ఇంత నీచమైన పనులు చేస్తున్నారని మండిపడ్డారు. తాను తన కొత్త సినిమా అప్ డేట్స్ ని ఫ్యాన్స్ తో పంచుకోవాలని అనుకున్నానని, అలాంటి సమయంలో ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేశారని ఆమె సీరియస్ అయ్యారు. ఇలాంటి పనికి రాని విషయాలపై స్పందించడం కూడా తన బాధగా ఉందని చెప్పారు.

ఇక, ఆ ఫోటో విషయానికి వస్తే ఓ తమిళ సినిమా పూజా కార్యక్రమంలోనిది. వారి సంప్రదాయం ప్రకారం, పూజ కార్యక్రమంలో మెడలో దండలు వేసుకుంటారు. ఆమె పక్కన ఆ సమయంలో దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి ఉండగా, అతనితోనే పెళ్లి అయ్యిందని, మిగిలిన వారందరినీ తీసేసి, కేవలం వీరిద్దరినీ క్రాప్ చేసి, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇదిలా ఉండగా, సాయి పల్లవి రీసెంట్ గా నాగ చైతన్య కొత్త సినిమాలో హీరోయిన్ గా ఎన్నికైంది. చందు మొండేటి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.

Tags:    

Similar News