ఆ ముగ్గురికి రెస్ట్ ఈ ముగ్గుర్ని దించుతున్నారా?

సాధార‌ణంగా సీక్వెల్ అంటూ వీలైనంత వ‌ర‌కూ మొద‌టి భాగంలో న‌టించిన న‌టీన‌టులు కొన‌సాగిం చ‌డానికి అవ‌కాశం ఉంటుంది.

Update: 2024-08-02 01:30 GMT

కార్తీ హీరోగా మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో స్పై థ్రిల్ల‌ర్ `స‌ర్దార్ -2` షూటింగ్ ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. భారీ విజ‌యం సాధించిన `స‌ర్దార్` కి సీక్వెల్ గా ఈ చిత్రాన్నితెర‌కెక్కించ‌డంతో అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కోస‌మంటూ ఎదురు చూసే అభిమానులెంతో మంది ఉన్నారు. ఇప్ప‌టికే ఆల‌స్య మైన నేప‌థ్యంలో డిలే లేకుండా షూటింగ్ చేస్తున్నారు. మ‌రి ఇందులో హీరోయిన్లు ఎవ‌రు? అంటే ప్ర‌ముఖంగా ముగ్గురు భామ‌ల్ని ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది.

సాధార‌ణంగా సీక్వెల్ అంటూ వీలైనంత వ‌ర‌కూ మొద‌టి భాగంలో న‌టించిన న‌టీన‌టులు కొన‌సాగిం చ‌డానికి అవ‌కాశం ఉంటుంది. కానీ మిత్ర‌న్ ఇక్క‌డ ఆ ఛాన్స్ తీసుకోలేదు. హీరోయిన్ల విష‌యంలో ప్రేక్ష‌కుల‌కు ప్రెష్ ఫీల్ ని అందించే ఉద్దేశంలో భాగంగా పాత భామ‌ల్ని ఎవ‌ర్నీ కొన‌సాగించ‌లేదు. మొద‌టి భాగంలో రాశీఖ‌న్నా, ర‌జీషా విజ‌యన్, లైలా న‌టించారు. ఈ పాత్ర‌లు సినిమాలో ఎంతో కీల‌క‌మైన‌వి.

కానీ `స‌ర్దార్ -2` లో వాళ్ల‌ని ఎవ‌ర్నీ తీసుకోలేదు. వాళ్ల స్థానంలో మాళవికా మోహ‌న‌న్ ప్రియాంక మోహ‌న్, ఆషీకా రంగ‌నాధ్ ల్ని ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. ఆషికా రంగనాధ్ ఇప్ప‌టికే త‌న ఎంట్రీ ఖ‌రారు చేసింది. సినిమాలో కీల‌క‌మైన పాత్ర‌కు ఎంపికైన‌ట్లు తెలిపింది. ఇంత‌వ‌ర‌కూ అమ్మ‌డికి స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో న‌టించే ఛాన్స్ రాలేదు. క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల్లోనే న‌టిం చింది.

తొలిసారి యాక్ష‌న్ స్కోప్ ఉన్న చిత్రంలో ఛాన్స్ రావ‌డంతో అమ్మ‌డి ఆనందానికి అవ‌ధుల్లేవ్. న‌టిగా ఆమెలో కొత్త కొణాన్ని బ‌య‌ట‌కు తెచ్చే సినిమా అవుతుంద‌ని చెప్పొచ్చు. ఇక మోహ‌న‌న్ లు ఇద్ద‌రు ఇప్ప‌టికే త‌మిళ్ లో కొన్ని సినిమాలు చేసిన అనుభ‌వం ఉంది. కార్తీతో న‌టించ‌డం ఇదే తొలిసారి. ఆ భామ‌లు తెలుగు ప్రేక్ష‌కులు సుప‌రిచిత‌మే.

Tags:    

Similar News