గేమ్‌ ఛేంజర్‌ : ఆ హామీ ఇచ్చిన శంకర్‌

ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత చరణ్‌ నుంచి రాబోతున్న సినిమా ఇదే అవ్వడంతో అంచనాలు పాన్‌ ఇండియా స్థాయిలో ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

Update: 2024-07-11 06:21 GMT

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్‌ ఛేంజర్ సినిమా విడుదల తేదీ కోసం ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత చరణ్‌ నుంచి రాబోతున్న సినిమా ఇదే అవ్వడంతో అంచనాలు పాన్‌ ఇండియా స్థాయిలో ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఇండియన్ 2 సినిమాతో బిజీ బిజీగా ఉన్న శంకర్‌ త్వరలోనే గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌ ను ముగించే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా వెయిట్‌ చేస్తున్న ఇండియన్ 2 ను రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. గత రెండు వారాలుగా శంకర్ పూర్తిగా ఇండియన్‌ 2 ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ బిజీ గా ఉన్నాడు.

తాజాగా ఇండియన్ 2 ప్రమోషనల్ ఇంటర్వ్యూలో గేమ్‌ ఛేంజర్ సినిమా గురించి శంకర్‌ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గేమ్‌ ఛేంజర్‌ సినిమా తన శైలి మూవీగా చెప్పడంతో పాటు, ఔట్‌ అండ్‌ ఔట్ మాస్‌ చిత్రంగా ఉంటుందని, ప్రతి ఒక్కరిని మెప్పిస్తుందని అన్నాడు.

గేమ్‌ ఛేంజర్ మూవీ తో రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌ కచ్చితంగా థ్రిల్‌ ఫీల్‌ అవుతారని, సినిమా ఒక మంచి పొలిటికల్‌ డ్రామాగా రూపొందుతున్నట్లుగా శంకర్‌ పేర్కొన్నాడు. శంకర్‌ వ్యాఖ్యలతో రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థ్రిల్‌ చేసే విధంగా సినిమా ఉండబోతుంది అంటే అంతకు మించి కావాల్సింది ఏముంది అన్నట్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

దిల్‌ రాజు భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా లో చరణ్‌ కు జోడీగా కియారా అద్వానీ మరియు అంజలి నటిస్తున్నారు. రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్న రామ్‌ చరణ్‌ తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా పాన్‌ ఇండియా రేంజ్‌ లో మరోసారి ప్రేక్షకులను అలరిస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ఇంకా విడుదల తేదీ కన్ఫర్మ్‌ అవ్వనప్పటికీ ఈ ఏడాదిలో కచ్చితంగా రిలీజ్ ఉంటుంది అని మాత్రం అభిమానులకు మరియు ప్రేక్షకులు చిత్ర యూనిట్‌ సభ్యులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. మరి ఎప్పటికి సినిమా విడుదల అయ్యేది చూడాలి.

Tags:    

Similar News