నిర్మాత శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డికి స‌తీ వియోగం

టాలీవుడ్ సుప్ర‌సిద్ధ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య వరలక్ష్మి (65) బుధవారం స్వర్గస్తులయ్యారు

Update: 2024-08-08 04:44 GMT

టాలీవుడ్ సుప్ర‌సిద్ధ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య వరలక్ష్మి (65) బుధవారం స్వర్గస్తులయ్యారు. గ‌త కొంత‌కాలంగా క్యాన్స‌ర్ కి చికిత్స పొందుతున్న శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మి చివ‌రికి క‌న్ను మూసారు. ఈమె దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తే. ఆమె సోద‌రుడు ప్ర‌స్తుతం డోన్ ఎమ్మెల్యే.

సోదరి అస్వ‌స్థ‌ ప‌రిస్థితి తెలిసిన అనంత‌రం నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఉదయమే హైదరాబాద్ బయలుదేరి వెళ్లార‌ని కూడా తెలుస్తోంది. సినీరాజ‌కీయ నేప‌థ్యాలు ఉన్న కుటుంబం నుంచి వరలక్ష్మి వ‌చ్చారు. ఆమె మరణంతో పలువురు సినీ సెలబ్రిటీలు, టిడిపి నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సోదరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తెలుగు చిత్ర‌సీమ‌, బుల్లితెర‌కు నిర్మాత‌ శ్యాం ప్ర‌సాద్ రెడ్డి చేసిన సేవ‌లు అస‌మాన‌మైన‌వి. అనుష్క క‌థానాయికగా ఆయ‌న తెర‌కెక్కించిన అరుంధ‌తి గొప్ప విజ‌యం సాధించ‌డ‌మే గాక‌, నిర్మాత‌గా ఆయ‌న‌కు మంచి పేరు తెచ్చి పెట్టింది. మ‌ల్లె మాల ఎంట‌ర్ టైన్ మెంట్స్ లో బుల్లితెర కార్య‌క్ర‌మాల రూప‌క‌ల్ప‌న‌లోను ఆయ‌న ముందున్నారు. జ‌బ‌ర్ధ‌స్త్ కామెడీ షోని విజ‌య‌వంతంగా నిర్మించిన సంస్థ‌కు వ్య‌వ‌స్థాప‌కులు ఆయ‌న‌. త‌లంబ్రాలు, అంకుశం, ఆహుతి, అమ్మోరు, అంజి స‌హా ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల‌ను శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి నిర్మించారు. ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ సీరియ‌ళ్ల‌ను ఆయ‌న నిర్మించారు.

Tags:    

Similar News