డిజైన‌ర్ ఇంట దీపావ‌ళి పార్టీలో అక్కినేని కోడ‌లు

ఇప్పుడు ప్ర‌ఖ్యాత డిజైన‌ర్ మనీష్ మల్హోత్రా ఇంట‌ దీపావళి పార్టీ హాట్ టాపిక్ గా మారింది. ఈ పార్టీకి హాజరయ్యేందుకు శోభితా ధూళిపాలా త‌న పెళ్లి ప్రిపరేషన్ నుండి కొంత విరామం తీసుకుంది.

Update: 2024-10-23 06:41 GMT

29 అక్టోబ‌ర్ 2024 దీపావ‌ళిని పుర‌స్క‌రించుకుని ఈ వారం అంతా బాలీవుడ్ లో నైట్ పార్టీలు పీక్స్ కి చేరుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ప‌లువురు టాప్ సెల‌బ్రిటీలు త‌మ ఇంట భారీగా వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తూ ఇండ‌స్ట్రీ స‌హ‌చ‌రులు, స‌న్నిహితుల‌ను ఆహ్వానిస్తున్నారు. బాలీవుడ్ పార్టీ క‌ల్చ‌ర్ లో ఇది ఒక భాగం. పండుగ లేదా ఇంట్లో ఏదైనా ఉత్స‌వం పేరుతో అక్క‌డ హంగామా మామూలుగా ఉండదు.

 

ఇప్పుడు ప్ర‌ఖ్యాత డిజైన‌ర్ మనీష్ మల్హోత్రా ఇంట‌ దీపావళి పార్టీ హాట్ టాపిక్ గా మారింది. ఈ పార్టీకి హాజరయ్యేందుకు శోభితా ధూళిపాలా త‌న పెళ్లి ప్రిపరేషన్ నుండి కొంత విరామం తీసుకుంది. ఈ కార్యక్రమంలో శోభిత చీర క‌ట్టులో ఎంతో అందంగా క‌నిపించింది. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాల్లో షేర్ అయ్యాయి. డిజైన‌ర్ ఇంట దీపావ‌ళి పార్టీలో అక్కినేని కోడ‌లు నిజంగా కేంద్ర‌క ఆక‌ర్ష‌ణ‌గా క‌నిపించింది. పార్టీ కోసం శోభిత వెండి, నీలం రంగు చీర కాంబినేష‌న్ బ్లౌజ్ ధరించింది. ఎంపిక చేసుకున్న‌ చెవిపోగులు, బ్యాంగిల్స్ కూడా ఆక‌ట్టుకున్నాయి. పార్టీలో కొలీగ్స్‌తో చేరే ముందు వేదిక వద్ద నిలబడిన స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ల‌కు శోభిత పోజులు ఇచ్చింది. ఈ పార్టీలో దిశా ప‌టానీ, జాన్వీ క‌పూర్, ఆలియా భ‌ట్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ వారం ప్రారంభంలో అక్కినేని- ధూలిపాళ కుటుంబాలు చై-శోభిత జంట‌ వివాహ వేడుకలకు సంబంధించిన స‌న్నాహ‌కాల‌ను ప్రారంభించాయి. శోభిత ఇన్‌స్టాగ్రామ్‌లో వెళ్లి పసుపు దంచే వేడుక నుండి ఫోటోలను షేర్ చేసింది. గోధుమ రాయి- పసుపు దంచడంతో ఇది(పెళ్లి వేడుక‌) ప్రారంభమైంది! అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. దీపావ‌ళి వేడుక‌లో శోభిత బంగారం, ఆకుపచ్చ అంచుతో కూడిన వైబ్రెంట్ చీరను ధరించింది. ఫోటోలలో తన ఇంటిలో చుట్టూ మహిళలతో వైభ‌వంగా కనిపించింది. పసుపు దంచడం అనేది సాంప్రదాయ తెలుగు వివాహానికి ముందు జరిగే వేడుక. ఇది వివాహ సంబరాలకు నాంది శోభిత పసుపును దంచి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటూ కనిపించింది.

శోభిత-నాగ చైతన్యల పెళ్లి తేదీ , వేదిక త‌దిత‌ర వివ‌రాలు అధికారికంగా ఇంకా వెలువడాల్సి ఉంది. ఆగస్టులో చైతన్య - శోభిత జంట త‌మ‌ కుటుంబాలు స్నేహితుల సమక్షంలో హైదరాబాద్‌లో జరిగిన ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. నాగార్జున అక్కినేని తన కుమారుడు చైతన్య - శోభిత నిశ్చితార్థ వేడుక నుండి ఫోటోలను తన X ఖాతాలో షేర్ చేసి అధికారికంగా పెళ్లి వార్తను ప్రకటించారు.

నాగ చైతన్య గతంలో సమంత రూత్ ప్రభుని వివాహం చేసుకున్నారు. కానీ క‌ల‌త‌ల కార‌ణంగా, అక్టోబరు 2021లో ఉమ్మడి ప్రకటనలో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్ర‌స్తుతం చై, స‌మంత‌, శోభిత ఎవ‌రి దారిలో వారు కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్నారు. శోభిత చివరగా వందనా కటారియా దర్శకత్వం వహించిన లవ్ సితారలో కనిపించింది. రోనీ స్క్రూవాలా నిర్మించారు. ఇందులో శోభితా ధూళిపాళ - రాజీవ్ సిద్ధార్థ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు. ఇది సెప్టెంబర్ 2024లో ZEE5లో విడుదలైంది.

Tags:    

Similar News