కీరవాణి రెండో కొడుకు.. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి..

బీకామ్ అడ్వర్టైజ్మెంట్స్ చదివానని, కానీ మధ్యలో చదువు ఆపేశానని చెప్పారు.

Update: 2024-09-11 09:36 GMT

ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి రెండో కొడుకు శ్రీసింహ.. హీరోగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. మత్తు వదలరా మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. డెబ్యూతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇటీవల ఉస్తాద్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇప్పుడు మత్తు వదలరా-2తో సందడి చేయనున్నారు. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయాన్ని తెలిపారు శ్రీసింహ.

'మీ డెబ్యూ ఫిల్మ్ మత్తు వదలరా మూవీ లేదా ఓ సినిమాకు అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశారని తెలిసింది.. అది నిజమేనా!' అని మీడియా ప్రతినిధి అడిగారు. దీంతో శ్రీసింహ స్పందించారు. తాను ఏ సినిమాకు కూడా అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేయలేదని చెప్పారు. తాను అసలు మ్యూజిక్ వైపు వెళ్లలేదని చెప్పారు. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ రంగస్థలం మూవీకి గాను సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశానని తెలిపారు.

అసలు మీకు సుకుమార్ తో వర్క్ చేసే అవకాశం ఎలా వచ్చిందని అడగ్గా.. "సినిమాల్లోకి రావాలని ఫుల్ క్లారిటీ తెచ్చుకున్నా.. కాలేజీలో చదువుకోవాలని అస్సలు లేదు.. సినిమాలు చేయాలనే ఉండేది.. యాక్టింగ్ వైపు వెళ్లానని నిర్ణయం తీసుకున్నా.. అప్పుడు అనుభవం కోసం, ఇండస్ట్రీ కోసం తెలుసుకోవడం కోసం.. మూవీకి వర్క్ చేద్దామనుకున్నా. అలా రంగస్థలం సినిమాకు సుకుమార్ గారి దగ్గర పని చేశా" అని శ్రీసింహ తెలిపారు.

బీకామ్ అడ్వర్టైజ్మెంట్స్ చదివానని, కానీ మధ్యలో చదువు ఆపేశానని చెప్పారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చానని తెలిపారు. వైజాగ్ లో పుట్టానని, ఆ తర్వాత రెండేళ్ల వయసులో ఇండస్ట్రీ అవసరాలకు నాన్న గారితో కలిసి చెన్నైకి వెళ్లామని చెప్పారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేసినట్లు వెల్లడించారు. రాయచూర్ కోసం తనకేం తెలియదని పేర్కొన్నారు. తమిళం అర్థం అవుతుందని, కానీ ఫ్లుయంట్ గా మాట్లాడలేనని శ్రీసింహా తెలిపారు.

అయితే శ్రీసింహా కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం మూవీకి శ్రీసింహ అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారని తెలిసి నెటిజన్లు అంతా షాకవుతున్నారు. సుకుమార్ వద్ద రాటుదేలాడన్న మాట అని కామెంట్లు పెడుతున్నారు. లెక్కల మాస్టర్ దగ్గర వర్క్ చేయడం మామూలు విషయం కాదని చెబుతున్నారు. ఈ విషయం ఇప్పటి వరకు తెలియలేదని అంటున్నారు.

Tags:    

Similar News