'జాట్' ఫస్ట్ లుక్: బాలీవుడ్ హీరోని మాస్ యాక్షన్ అవతార్‌లో చూపించిన టాలీవుడ్ డైరెక్టర్!

సన్నీ డియోల్‌, గోపీచంద్ మలినేనిల చిత్రానికి ''జాట్'' అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఈరోజు (అక్టోబర్ 19) సన్నీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ ను చిత్ర నిర్మాతలు ఆవిష్కరించారు.

Update: 2024-10-19 06:22 GMT

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సీనియర్ యాక్షన్ హీరో సన్నీ డియోల్‌తో కలిసి ఓ స్ట్రెయిట్ హిందీ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకూ #SDGM అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేసారు.

 

సన్నీ డియోల్‌, గోపీచంద్ మలినేనిల చిత్రానికి ''జాట్'' అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఈరోజు (అక్టోబర్ 19) సన్నీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ ను చిత్ర నిర్మాతలు ఆవిష్కరించారు. ''మాసివ్ యాక్షన్ కు నేషనల్ పర్మిట్ కలిగిన వ్యక్తిని పరిచయం చేస్తున్నాము. హ్యాపీ బర్త్‌డే యాక్షన్ సూపర్‌ స్టార్. మాస్ ఫీస్ట్ లోడింగ్'' అని పేర్కొన్నారు. సన్నీని మాస్ యాక్షన్ అవతార్‌లో ప్రెజెంట్ చేసిన ఈ పోస్టర్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది.

'జాట్‌' ఫస్ట్ లుక్ లో సన్నీ డియోల్ ఓ పెద్ద ఫ్యాన్ ని పట్టుకొని సీరియస్ గా ఇంటెన్స్ గా చూస్తూ కనిపించారు. సెటప్ అంతా చూస్తుంటే ఇది ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించిందని అర్థమవుతోంది. అలానే టైటిల్ లోగో బోల్డ్ ఫాంట్‌తో ఆకట్టుకునేలా డిజైన్ చేయబడింది. దీనిపై రక్తపు మరకలు చూస్తుంటే.. ఇది భారీ యాక్షన్ మూవీగా రాబోతోందని తెలుస్తోంది. ఇక ఈరోజు సాయంత్రం ఈ మూవీ మోషన్ పోస్టర్ ను కూడా లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

'క్రాక్' 'వీర సింహా రెడ్డి' వంటి సినిమాలతో మాస్ అంటే ఏంటో చూపించిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. ఈసారి 'జాట్' మూవీతో నార్త్ ఆడియన్స్ కు తన మాస్ చూపించబోతున్నాడని ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతోంది. సన్నీ డియోల్‌ను మునుపెన్నడూ చూడని మాస్, యాక్షన్ అవతార్‌లో చూపించడంలో సక్సెస్ అయ్యారు. 'గదర్ 2' సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన సన్నీ నుంచి రాబోతున్న ఈ చిత్రంపై బాలీవుడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి.

''జాట్'' మూవీలో రణ్‌దీప్ హుడా, రెజీనా కసాండ్రా, సయామీ ఖేర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తున్నారు. నవీన్ యెర్నేని, వై రవి శంకర్, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు టీమ్ కలిసి హిందీలో చేస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ జానాల దృష్టి పడింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Tags:    

Similar News