ప్లీజ్‌... కాస్త క్లీయర్‌గా చెప్పు థమన్‌

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌' ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది.

Update: 2024-09-16 07:30 GMT

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌' ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్‌ లోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ డిసెంబర్‌ లో సినిమా విడుదల చేయడం సాధ్యం కాకుంటే వచ్చే ఏడాది సమ్మర్ వరకు వెయిట్‌ చేయాల్సి ఉంటుంది. అందుకే దర్శకుడు శంకర్‌ పై నిర్మాత దిల్‌ రాజు ఒత్తిడి చేస్తున్నాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్వరలోనే విడుదల విషయమై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే గేమ్‌ ఛేంజర్ సినిమా నుంచి ఒక పాట వచ్చింది. ఆ పాట కు మంచి స్పందన వచ్చింది. ఆ పాట వచ్చి చాలా రోజులైనా సెకండ్‌ సింగిల్ ను ప్రకటించకపోవడంతో ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు అంతా గేమ్‌ ఛేంజర్‌ ఈ ఏడాది విడుదల అయ్యేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు వినాయక చవితి సందర్భంగా గేమ్‌ ఛేంజర్‌ రెండో సింగల్ ను తీసుకు రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ నెలలోనే పాట ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఎప్పుడు ఆ పాట వస్తుంది అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

తాజాగా సంగీత దర్శకుడు థమన్‌ సోషల్‌ మీడియాలో ఒక ఫోటోను షేర్‌ చేసి, దాని పై గేమ్‌ ఛేంజర్ హ్యాష్ ట్యాగ్‌ ను పెట్టడం జరిగింది. దాంతో గేమ్‌ ఛేంజర్ సినిమా పాట అప్‌డేట్‌ హింట్‌ అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం థమన్‌ ఈ వేశాలు మానేసి కాస్త క్లీయర్‌ గా సెకండ్ సింగిల్‌ అప్డేట్‌ ఇవ్వచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సెకండ్‌ సింగల్‌ కోసం రామ్‌ చరణ్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. అతి త్వరలోనే సినిమా యూనిట్‌ సభ్యులు అధికారికంగా తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఆ తేదీ ఎప్పుడు అనేదే ఇప్పుడు ఫ్యాన్స్ ను వేధిస్తున్న ప్రశ్న.

తమిళ్‌ స్టార్‌ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్‌ ఛేంజర్‌ సినిమాను తెలుగు లో మాత్రమే కాకుండా సౌత్ లో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు, అలాగే నార్త్‌ లో హిందీ భాషలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. శంకర్ గత చిత్రం ఇండియన్‌ 2 ఫలితం కారణంగా గేమ్‌ ఛేంజర్ సినిమా పై ఒకింత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ దిల్ రాజు తో పాటు, మెగా కాంపౌండ్‌ కథ పై సుదీర్ఘమైన కసరత్తు తర్వాతే షూటింగ్‌ మొదలు పెట్టారు కనుక కచ్చితంగా మంచి ఫలితాన్ని దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఒక పాత్రకు కియారా అద్వానీ హీరోయిన్‌ గా కనిపించనుండగా, మరో పాత్రకి జోడీగా అంజలి కనిపించబోతుంది. ఈ సినిమాలో ఎస్‌ జే సూర్య, నవీన్ చంద్ర శ్రీకాంత్‌ ఇంకా పలువురు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

Tags:    

Similar News