20+ కుర్ర భామలతో 50+ హీరోల రొమాన్స్!

ప్రస్తుతం టాలీవుడ్ లో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి హీరోలు 50+ ఏజ్ లో ఉన్నారు.

Update: 2024-07-05 16:30 GMT

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఏజ్ అయిపోతుంది కానీ, హీరోలకు మాత్రం వయసు మీద పడదు. ఏజ్ పెరిగేకొద్దీ వాళ్ళు స్క్రీన్ పై మరింత యంగ్ గా కనిపించాలానే కోరుకుంటారు. దానికి తగ్గట్టుగానే యంగ్ హీరోయిన్లే తమ పక్కన ఆడిపాడాలని భావిస్తారు. అందుకే ఈరోజుల్లో సీనియర్ స్టార్ హీరోలకు జోడీలను సెట్ చేయడం మేకర్స్ కు చాలా కష్టంగా మారింది. అన్నీ పక్కాగా కుదిరినా, ఒక్క కథానాయిక ఎంపిక విషయంలో మాత్రం దర్శక నిర్మాతలకు తలప్రాణం తోక్కొస్తుంది. క్రేజ్, డిమాండ్, మార్కెట్ లెక్కలు అన్నీ పరిగణలోకి తీసుకొని కుర్ర భామలను తీసుకొస్తే.. కూతురు వయసున్న హీరోయిన్లతో రొమాన్స్ ఏంటంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి హీరోలు 50+ ఏజ్ లో ఉన్నారు. వీళ్ళు నటిస్తున్న సినిమాల్లో మాత్రం 20+ వయసున్న హీరోయిన్లు ఉంటున్నారు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న 'మిస్టర్ బచ్చన్' మూవీతో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తోంది. రవితేజ వయసు 56 ఏళ్లయితే, భాగ్యశ్రీ ఏజ్ జస్ట్ 25 ఏళ్ళు మాత్రమే. అంటే ఇద్దరికీ 30 ఏళ్లకు పైగా ఏజ్ గ్యాప్ ఉంది. తాజాగా చిత్ర బృందం వదిలిన ఫస్ట్ సింగిల్ ప్రోమోలో ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ చూసి, కొందరు నెటిజన్లు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ట్రోల్ చేస్తున్నారు. రవితేజ ఇటీవలే ప్రారంభించిన RT75 హీరోయిన్ శ్రీలీల వయస్సు 23 ఏళ్లే అనే సంగతి తెలిసిందే.

Read more!

విక్టరీ వెంకటేష్ రీసెంట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'VenkyAnil3' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా షూటింగ్ ప్రారంభించారు. దీంట్లో 63 ఏళ్ళ వెంకీ సరసన ఐశ్వర్య రాజేష్(34), మీనాక్షి చౌదరి(27) కథానాయికలుగా నటిస్తున్నారు. అందులో ఒకరు భార్యగా, మరొకరు మాజీ ప్రేయసిగా కనిపించనున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎలాంటి స్టోరీ తీస్తున్నాడో తెలియకుండానే, వెంకటేష్ లో సగం వయసు లేని హీరోయిన్లను తీసుకోవడంపై నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. వెంకీ పక్కన మీనాక్షి కూతురిలా ఉంటుందని, స్క్రీన్ మీద వాళ్ళిద్దరినీ చూడటం ఎబ్బెట్టుగా ఉంటుందన్నట్లు కామెంట్లు చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'విశ్వంభర' సినిమాలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మరో హీరోయిన్ గా ఆషికా రంగనాథ్ ను తీసుకున్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 27 ఏళ్ళు. ఇంతకముందు 'నా సామి రంగా' చిత్రంలో కింగ్ అక్కినేని నాగార్జున సరసన నటించింది. నటసింహ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబోలో 'NBK 109' మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటివరకూ హీరోయిన్ల పేర్లను రివీల్ చెయ్యలేదు. కానీ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా తో పాటుగా మరో యంగ్ బ్యూటీ నటిస్తున్నట్లు టాక్ ఉంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుత వయసు 55 ఏళ్ళు. ఆయన నటిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రంలో కథానాయిక నిధి అగర్వాల్ ఏజ్ 30 ఏళ్ళు. 'ఉస్తాద్ భగత్ సింగ్' లో పవన్ కన్నా 22 సంవత్సరాలు చిన్నదైన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. OG మూవీలో 29 ఏళ్ళ ప్రియాంక మోహన్ జోడీ కడుతోంది. ఇలా 50 ఏళ్ళు దాటిన మన హీరోలంతా తమకన్నా చాలా తక్కువ ఏజ్ ఉన్న కుర్ర భామల సరసన నటిస్తుండటంపై నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అనుష్క, త్రిష, నయనతార, కాజల్ అగర్వాల్, ప్రియమణి లాంటి సీనియర్ హీరోయిన్లతో కాకుండా.. ఇంకా పడుచు హీరోయిన్లతో రొమాన్స్ చేయాలని కోరుకుంటున్నారని, ఆరు పదుల వయసు దాటేసినా వారి పక్కన యంగ్ గా కనిపించడానికి వీఎఫ్ఎక్స్ కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టిస్తున్నారని ట్రోలింగ్ చేస్తున్నారు.

అయితే సినిమాని సినిమాగే చూడాలని, స్టార్ హీరోల స్క్రీన్ ప్రెజెన్స్ కు ఏజ్ తో సంబంధమేమీ ఉండదని మరికొందరు మద్దతుగా నిలుస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ కు మనవరాలిగా నటించిన శ్రీదేవి.. తర్వాతి రోజుల్లో హీరోయిన్ గా నటిస్తే జనాలు యాక్సెప్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చిరంజీవి & బాలయ్యలకు జోడీగా శృతి హాసన్ నటించిన 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహారెడ్డి' సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయని అంటున్నారు. ఇంతకముందు రవితేజ - శ్రీలీల కలిసి 'ధమాకా' సినిమాతో అలరించారని.. 'నా సామి రంగా' చిత్రం విజయం సాధించడమే కాదు, నాగ్ - ఆశికా పెయిర్ బాగుందని అందరూ మెచ్చుకున్నారని చెబుతున్నారు. కంటెంట్ నచ్చితే ప్రేక్షకులు హీరో హీరోహీరోయిన్ల మధ్య వయసు వ్యత్యాసాన్ని అస్సలు పట్టించుకోరనే విషయం స్పష్టమైందని, కాబట్టి ఈ డిస్కషన్ అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News

eac