త్రిష రేర్ రికార్డ్! ఈ మ్యాటర్ తెలుసా?

ఇండస్ట్రీలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ కెరీర్ స్టార్ట్ చేసిన త్రిష.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిపోయారు.

Update: 2024-10-05 02:30 GMT

సీనియర్ బ్యూటీ త్రిష.. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఒకానొక టైమ్ లో టాలీవుడ్ ను ఓ రేంజ్ లో ఏలిన ముద్దుగుమ్మ.. ఇక్కడి స్టార్ హీరోలందరి సరసన సినిమాల్లో నటించి మెప్పించారు. ఇండస్ట్రీలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ కెరీర్ స్టార్ట్ చేసిన త్రిష.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిపోయారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో యాక్ట్ చేశారు. మరెన్నో హిట్స్ అందుకున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ నటించి సత్తా చాటారు.

అప్పట్లో మోహిని, నాయకి వంటి సినిమాలతో వరుస ఫ్లాపులు మాటుగట్టుకోగా.. త్రిష కెరీర్ క్లోజ్ అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ 96 సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. అప్పటి నుంచి సరైన ప్రాజెక్టులు ఎంపిక చేసుకుని అదరగొడుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. బడా ప్రాజెక్టుల్లో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఆచితూచి ప్రాజెక్టులు ఎంచుకుంటున్నారు. అదే సమయంలో మంచి హిట్స్ కూడా అందుకుంటున్నారు త్రిష.

ఇటీవల పొన్నియన్ సెల్వన్, లియో సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న త్రిష.. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో రెండు చిత్రాలు చేస్తున్నారు. విడా ముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీలో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో త్రిషకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. తమిళనాడులో రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన కోలీవుడ్ మూవీస్ అన్నింటిలో త్రిష భాగమవ్వడం విశేషం. ఇదొక రికార్డు అనే చెప్పాలి.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన లియో మూవీ.. తమిళనాడులో దాదాపు రూ.230 కోట్లకు పైగా వసూలు చేసింది. అందులో త్రిష.. దళపతి విజయ్ కు జోడీగా నటించిన విషయం తెలిసిందే. స్టార్ క్యాస్టింగ్ విక్రమ్, ఐశ్వర్యా రాయ్, కార్తీతో కలిసి త్రిష నటించిన.. పొన్నియన్ సెల్వన్-1 రూ.220 కోట్లు రాబట్టింది. రీసెంట్ గా త్రిష స్పెషల్ సాంగ్ చేసిన.. దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్- ది గోట్ మూవీ.. రూ. 210 కోట్లకు వసూళ్లను సాధించింది.

ది గోట్ మూవీలో మట్టా సాంగ్ కు గాను త్రిష చిందులేసి అందరినీ ఆకట్టుకున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె మాస్ సాంగ్ కు డ్యాన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయితే కోలీవుడ్ సినిమాస్ తో పాటు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికు జోడీగా విశ్వంభరలో నటిస్తున్నారు త్రిష. మాలీవుడ్ లో అఖిల్ పాల్ దర్శకత్వం వహిస్తున్న ఐడెంటిటీలో యాక్ట్ చేస్తున్నారు. మరి త్రిష.. తన అప్ కమింగ్ మూవీస్ తో ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News