క్రేజీ స్టార్‌ 50వ చిత్రం ఇంట్రస్టింగ్‌ అప్డేట్‌

పాన్ ఇండియా స్టార్‌ నటుడు విజయ్ సేతుపతి ప్రస్తుతం తన 50వ సినిమా 'మహారాజా' ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు

Update: 2024-06-05 11:30 GMT

పాన్ ఇండియా స్టార్‌ నటుడు విజయ్ సేతుపతి ప్రస్తుతం తన 50వ సినిమా 'మహారాజా' ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. జూన్‌ 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో విజయ్ సేతుపతి నుంచి పలు విభిన్న చిత్రాలు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

'మహారాజా' సినిమా కూడా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది అంటూ మేకర్స్ చాలా నమ్మకంగా చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మరియు ఫ్యాన్స్ ను అలరించే విధంగా దర్శకుడు నితిలన్ స్వామినాథన్ ఈ సినిమాను రూపొందించాడు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఈ సినిమా విడుదలకు ముందు ఉన్న క్రేజ్ నేపథ్యంలో డిజిటల్ స్ట్రీమింగ్‌ రైట్స్ కి మంచి డిమాండ్‌ క్రియేట్‌ అయ్యింది. పలు ప్రముఖ ఓటీటీ సంస్థలు ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా చివరకు నెట్‌ ఫ్లిక్స్ వారు భారీ మొత్తానికి ఈ సినిమాను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

'మహారాజా' యొక్క ట్రైలర్ ను తెలుగు లో కూడా విడుదల చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు ప్రేక్షకుల్లో విజయ్ సేతుపతికి మంచి ఫాలోయింగ్‌ ఉంది. కనుక భారీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట.

ఈ సినిమాలో అనురాగ్‌ కశ్యప్ మరియు మమతా మోహన్‌ దాస్ లు కీలక పాత్రలో నటించారు. అజనీష్ లోక్‌నాథ్‌ సంగీతం అందించగా ఫ్యాషన్ స్టూడియోస్‌ మరియు ది రూట్‌ బ్యానర్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. విజయ్ సేతుపతి మైల్‌ స్టోన్ మూవీ అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.

Tags:    

Similar News