ఆయ‌న‌పై గౌర‌వం ఉంది..నేను అంకుల్ అని పిలుస్తా!

త‌న అభిప్రాయం తెలియ‌జేయ‌డానికే తాను పోస్ట్ పెట్టాన‌ని..అందులో ఎలాంటి కాంట్ర‌వ‌ర్శీ లేద‌న్నాడు.

Update: 2024-09-29 16:14 GMT

తిరుమ‌ల ల‌డ్డు విష‌యంలో `మా` అధ్య‌క్షుడు మంచు విష్ణు-విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ మ‌ధ్య ఎక్స్ వేదిక‌గా మాట‌ల యుద్ధం సాగిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌కాష్ రాజ్ స్పందిస్తే... `మీ ప‌రిధుల్లో మీరు ఉండండి` అంటూ ప్ర‌కాష్ రాజ్ పై మంచు విష్ణు ఓ పోస్ట్ పెట్టాడు. ప్ర‌తీగా ప్ర‌కాష్‌రాజ్ స్పందించ‌డం జ‌రిగింది. తాజాగా దీనిపై మ‌రోసారి విష్ణు స్పందించాడు.

త‌న అభిప్రాయం తెలియ‌జేయ‌డానికే తాను పోస్ట్ పెట్టాన‌ని..అందులో ఎలాంటి కాంట్ర‌వ‌ర్శీ లేద‌న్నాడు. `అది పూర్తిగా ఆయ‌న వ్య‌క్తిగత అభిప్రాయం. అదే విధంగా నా అభిప్రాయాన్నితెలియజేసా. ఒక హిందువుగా, తిరుప‌తి వాసిగా ఆ వివాదానికి మతం రంగు లేద‌ని గ‌ర్వంగా చెప్ప‌గ‌ల‌ను. ఆయ‌న వ్యాఖ్య‌లు క‌రెక్ట్ కాద‌ని తెలియ‌జేసా. నాన్న న‌టించిన చాలా సినిమాల్లో ఆయ‌న న‌టించారు.

ఎంతో కాలం నుంచి ఆయ‌న తెలుసు. నేను అంకుల్ అని పిలుస్తుంటా. ఆయ‌నంటే గౌర‌వం ఉంది. ఎలాంటి వివాదం లేదు` అని విష్ణు అన్నారు. అలాగే ఈ వివాదంపై న‌టీనటులు స్పందిచ‌క పోవ‌డం గురించి ఆయ‌న మాట్లాడారు. `మేము అద్దాల మేడ‌ల్లో ఉంటాం. ఏదైనా విష‌య‌మై మేము మాట్లాడితే కొంత‌మందికి న‌చ్చ‌వ‌చ్చు. మ‌రికొంత మందికి న‌చ్చ‌క‌పోవ‌చ్చు.

న‌చ్చ‌ని వాళ్లు మ‌మ్మ‌ల్ని సుల‌భంగా టార్గెట్ చేస్తారు. అందుకే న‌టీన‌టులు చాలా జాగ్ర‌త్త‌గా ఆచిచూతి మాట్లాడుతారు. ఈ వివాదంపై బ‌హిరంగంగా మాట్లాడితే ఎవ‌రి మ‌నోభావాలైన దెబ్బ‌తింటాయేమోన‌ని భ‌యంగా ఉంది` అన్నారు.

Tags:    

Similar News