వైజయంతీ​ వార్నింగ్​ వెనక మర్మమేమిటో..?

అయితే తాజాగా ఈ చిత్రాన్ని నిర్మించిన వైజయంతి మూవీస్​... ఓ వార్నింగ్ నోట్ రిలీజ్ చేసి అటు చిరు అభిమానులను, సినీ ప్రియులను షాక్ అండ్ సర్​ప్రైజ్​కు గురి చేసింది.

Update: 2023-10-11 15:18 GMT

మెగాస్టార్ చిరంజీవి - అలనాటి తార శ్రీదేవి హీరో హీరోయిన్లుగా వచ్చిన సోషియో ఫాంటసీ సినిమా 'జగదేకవీరుడు అతిలోకసుందరి'. ఈ చిత్రం ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో తెలిసిన విషయమే. టాలీవుడ్​లో ఓ కల్ట్ క్లాసిక్ హిట్​గా నిలిచిపోయింది. కె రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.


అయితే తాజాగా ఈ చిత్రాన్ని నిర్మించిన వైజయంతి మూవీస్​... ఓ వార్నింగ్ నోట్ రిలీజ్ చేసి అటు చిరు అభిమానులను, సినీ ప్రియులను షాక్ అండ్ సర్​ప్రైజ్​కు గురి చేసింది. సినిమాకు సంబంధించిన అన్నీ కాపీ రైట్స్ తమవే అని, వారి ప్రమేయం లేకుండా.. సినిమాలోని కంటెంట్ ఏ రకంగానూ వినియోగించకూడదని హెచ్చరికలు జారీ చేసింది.

ఒకవేళ ఎవరైనా ఈ చర్యలను అతిక్రమిస్తే.. వారిపై లీగల్ యాక్షన్ తీసుకునే హక్కు తమకు ఉందంటూ చెప్పింది. దీంతో ప్రస్తుతం ఈ నోట్ చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంత అకస్మాతుగా ఈ వార్నింగ్ ఓటీస్​ ఎవరి కోసం, ఎందుకోసం ఇచ్చారో అన్నదానిపై ప్రస్తుతం అందరూ తెగ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ కొత్త వార్త తెరపైకి వచ్చింది. అదేంటంటే.. మెగాస్టార్ చిరంజీవి - బింబిసార డైరెక్టర్​ వశిష్ఠతో కలిసి మెగా 157 సినిమా చేయబోతున్నారు.

ఈ చిత్రం కూడా సోషయో ఫాంటసీగానే రాబోతుంది. ఈ చిత్రంలో దర్శకుడు విశిష్ఠ.. జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ కంటెంట్​ను రిఫరెన్స్​గా వినియోగించబోతున్నారని బయట వార్తలు వస్తున్నాయి. అందుకే వైజయంతీ ఈ వార్నింగ్ నోటీస్ పంపించిందని అంతా మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలీదు అందరూ దీని గురించి మాట్లాడుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

కాగా, భోళాశంకర్‌ లాంటి డిజాస్టర్​ తర్వాత చిరంజీవి నటిస్తున్న చిత్రమిదే. చిత్రంలో అనుష్క శెట్టి, మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్స్‌గా కనిపించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. చిరు పుట్టినరోజును పురస్కరించుకుని ఈ ప్రాజెక్ట్‌ రీసెంట్​గా అనౌన్స్‌ చేశారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితం కానుంది. ఇప్పటికే రిలీజైన కాన్సెప్ట్‌ పోస్టర్‌ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

Tags:    

Similar News