మంగళవారం డైరెక్టర్.. ఆ కాంబో క్యాన్సిల్?

పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా చేయాలని ప్లాన్ చేశారు.

Update: 2024-10-17 04:15 GMT

'ఆర్ ఎక్స్ 100’, ‘మహా సముద్రం’, ‘మంగళవారం’ సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి నెక్స్ట్ మూవీ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. ‘మంగళవారం’ సీక్వెల్ ని ఇప్పటికే అజయ్ భూపతి ఎనౌన్స్ చేశారు. ఇది కాకుండా చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా ఒక ప్రాజెక్ట్ అనుకున్నారు. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా చేయాలని ప్లాన్ చేశారు. అతనికి కథ నేరేట్ చేయగా ఒకే చెప్పారనే ప్రచారం నడిచింది.

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయినట్లు టాక్ వినిపించింది. అయితే ఎందుకనో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందనే మాట వినిపిస్తోంది. ఇద్దరి మధ్య స్టోరీ చర్చలు ఇప్పటికే చాలా సార్లు జరిగాయంట. అయితే ఫైనల్ గా మూవీ సెట్ కాలేదని తెలుస్తోంది. అయితే ధృవ్ విక్రమ్ ఎందుకు ఈ ప్రాజెక్ట్ రిజక్ట్ చేశారనేది క్లారిటీ లేదు. ధృవ్ విక్రమ్ తప్పుకోవడంతో ఇప్పుడు అజయ్ భూపతి వేరొక హీరోని ఆ మూవీ కోసం వెతుక్కునే పనిలో ఉన్నారంట.

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే విషయంపై చర్చ నడుస్తోంది. ఒకవేళ ధృవ్ విక్రమ్ తో క్యాన్సిల్ అయిన ప్రాజెక్ట్ హోల్డ్ అయితే ‘మంగళవారం’ సీక్వెల్ ని అజయ్ భూపతి స్టార్ట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా మంచి టాలెంటెడ్ డైరెక్టర్ గా ఇమేజ్ తెచ్చుకున్న తర్వాత కూడా అజయ్ భూపతి సినిమా సినిమాకి చాలా లాంగ్ గ్యాప్ తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుందని ఇండస్ట్రీ మాట్లాడుకుంటున్నారు.

అజయ్ భూపతి కొత్త సినిమా అప్డేట్ కోసం ఆయన సినిమాలు ఇష్టపడే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే అతను మాత్రం చాలా స్లో ఫేజ్ లో మూవీస్ చేస్తూ వస్తున్నాడు. స్టార్ హీరోతో సరైన మూవీ పడితే సందీప్ రెడ్డి వంగా రేంజ్ లో అజయ్ భూపతి పేరు కూడా టాలీవుడ్ లో మార్మోగిపోయేది అని అతని శైలి ఇష్టపడేవారు అంటున్నారు.

అయితే టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరూ బిజీగా ఉండటంతో అజయ్ భూపతి వారితో మూవీస్ చేయడం ఆలస్యం అవుతోంది. ఇదిలా ఉంటే ధృవ్ విక్రమ్ ప్రస్తుతం మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ‘బిసన్’ అనే మూవీ చేస్తున్నాడు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో ధృవ్ విక్రమ్ కి జోడీగా నటిస్తోంది.

Tags:    

Similar News