"లైసెన్స్డ్ వెపన్ క్యారీ చేయాలనుకుంటున్నా"... ఆనం సంచలన వ్యాఖ్యలు!

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి.

Update: 2024-10-23 10:41 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా వినిపించని ఓ మాట తాజాగా ఓ మంత్రి నుంచి వినిపించింది! తనకు ప్రాణహాని ఉందనట్లుగా.. లైసెన్సుడు తుపాకీ వాడాలని భావిస్తున్నానని.. తనచుట్టూ ఏదో జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయని.. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి.

అవును... తన సెక్యూరిటీ విషయంలో స్పందిస్తు.. చుట్టూ ఏదో జరుగుతోంది ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నెల్లూరులోని నివాసంలో ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించిన సమావేశం జరిగిందని.. ఈ సమావేశంలో వైసీపీకి చెందిన నేత ఒకరు స్వామి మాలలో కనిపించారని చెప్పుకొచ్చారు!

ఆయన లోపలికి వచ్చి.. ఎక్కడెక్కడ సీసీ కెమరాలు ఉన్నాయో చెక్ చేసుకుంటూ, పరిసర ప్రాంతాలపై రెక్కీ చేసినట్లు మంత్రి చెప్పారు. దీంతో.. ఈ విషయాన్ని తన అనుచరులు గమనించారని.. అతడి పట్టుకుని తీసుకొచ్చి, పోలీసులకు అప్పగించారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తన చుట్టూ ఏదో జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయన్నారు!

ఇక.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజుల్లోనే సీఎం చంద్రబాబును నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చానని.. ఇక్కడ రూ.వందల కోట్లతో పనులు జరుగుతున్నాయని.. దాన్ని సహించలేకే వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారంటూ మంత్రి సంచలన ఆరోపణలు చేశారు!

ఈ సమయంలోనే.. తన భద్రత గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మరోపక్క.. ఈ ఘటన అనంతరం పోలీసులు మంత్రి భద్రతను కట్టుదిట్టం చేశారని తెలుస్తోంది. ఇదే సమయంలో ఆనం నివాసంలో పట్టుబడిన వ్యక్తిని ప్రశ్నించినట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా... మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

Tags:    

Similar News