చైనాలో సరికొత్త కుంభకోణం... దేశాన్ని కుదిపేస్తోంది!

అవును... చైనాను ఇప్పుడు వంటనూనెల కుంభకోణం కుదిపేస్తుందని తెలుస్తోంది.

Update: 2024-07-11 15:30 GMT

చైనాలో 2008లో ఆహార కల్తీ కుంభకోణం దేశాన్ని కుదిపేసింది. ఇందులో భాగంగా... నాడు మెలామైన్ అనే కెమికల్ ను పాల పౌడర్ లో కలిపి విక్రయించడంతో సుమారు మూడు లక్షల మంది చిన్నారులు అనారోగ్యం పాలవ్వగా.. ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తాజాగా వంటనూనే కుంభకోణం తెరపైకి వచ్చింది. ఈ కుంభకోణం ఇప్పుడు చైనాను కుదిపేస్తుంది.

అవును... చైనాను ఇప్పుడు వంటనూనెల కుంభకోణం కుదిపేస్తుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ ను రవాణాచేసిన కంటైనర్లను ఏమాత్రం శుభ్రపరచకుండానే.. తిరిగి అదే కంటైనర్లలో వంటనూనెలు నింపి తరలించినట్లు ఆరోపణలు వెళ్లివెత్తుతున్నాయి. ఈ విషయం నెట్టింట గుప్పుమనడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి.

ఈ మేరకు బీజింగ్ న్యూస్ తాజాగా ఒక కథనం ప్రచురించింది. ఇందులో భాగంగా... చైనాలో వంటనూనెను ఇలా ప్రమాదకరమైన కంటైనర్లలో తరలించడం అనేది ఆ పరిశ్రమలో అత్యంత సహజమని, అది బహిరంగ రహస్యమని వెల్లడించింది. దీంతోపాటు ఇంధన రవాణాకు ఉపయోగించే ట్యాంకర్లను సిరప్ లు తరలించేందుకు కూడా వాడినట్లు గుర్తించారని వెల్లడించింది!

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ విషయం చైనాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ కు చేరింది. ఇందులో భాగంగా చైనా సోషల్ నెట్ వర్క్ ఫ్లాట్ ఫాం విబోలో ఈ కుంభకోణం కథనాన్ని మిలియన్ల మంది చూశారని తెలుస్తోంది. ఇదే సమయంలో.. ఈ వ్యవహారంలో చైనా ప్రభుత్వరంగ కంపెనీల పేర్లు కూడా వినిపిస్తుండటం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News