మూడ్ ఆఫ్ ది నేషన్... లోక్ సభ ఎన్నికలపై ఇండియా టుడే సర్వే!

అవును... మోడీకి 400 సీట్ల వరకూ సాధ్యమే? అంటూ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ వచ్చే ఎన్నికల ఫలితాలపై తమ అంచనాలను వెల్లడించింది

Update: 2024-02-08 12:59 GMT

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలూ వ్యూహ ప్రతివ్యూహాల్లో బిజీగా ఉండగా... కొన్ని మీడియా సంస్థలూ, సర్వే సంస్థలూ... రకరకాల పేర్లతో ఫలితాలపై వారి వారి అంచనాలను వెళ్లడిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా "మూడ్ ఆఫ్ ది నేషన్" పేరున జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే తాజాగా తమ అంచనాలను వెల్లడించాయి. ఈ సందర్భంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి దాదాపుగా భారీస్థాయిలో అనుకూలమైన ఫలితాలు వస్తాయన్నట్లుగా తెలిపింది!

అవును... మోడీకి 400 సీట్ల వరకూ సాధ్యమే? అంటూ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ వచ్చే ఎన్నికల ఫలితాలపై తమ అంచనాలను వెల్లడించింది. ఈ సందర్భంగా కొన్ని అంచనాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయనే కామెంట్లను సొంతం చేసుకోగా.. మరికొన్ని అంచనాలు మాత్రం వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలను ప్రజలపై రుద్దే ప్రయత్నంలో భాగంగా అనిపిస్తున్నాయనే విమర్శలను సొంతం చేసుకుంటున్నాయి. ఆ సంగతులు అలా ఉంటే... ఇండియా టుడే వెళ్లడించిన అంచనా ఫలితాలను ఇప్పుడు చూద్దాం...!

ఉత్తరప్రదేశ్:

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో వార్ వన్ సైడ్ అని అంచనా వేసింది ఇండియా టుడే. ఇందులో భాగంగా యూపీలోని 80 లోక్ సభ స్థానాల్లోనూ 72 స్థానాలను ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుందని.. ఇండియా కూటమి 8 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలున్నాయని అంచనా వేసింది.

ఢిల్లీ:

దేశ రాజధానిలో కూడా ఎన్డీఏ కూటమి తన సత్తా చాటే అవకాశాలున్నాయని ఇండియా టుడే అంచనా వేసింది. ఇందులో భాగంగా... ఎన్డీఏ 54%, ఇండియా కూటమి (ఆప్ - 15, కాంగ్రెస్ - 25) 40%, ఇతరులు 3% ఓట్ల షేర్ పొందే అవకాశం ఉందని తెలిపింది. ఇదే సమయంలో మొత్తం 7 స్థానాలు ఉంటే మొత్తం స్థానాలను ఎన్డీఏ కూటమి చేజిక్కించుకుంటుందని అంచనా ఏసింది.

హర్యానా:

ఇక హర్యానాలో ఓట్ల షేరింగ్ విషయానికొస్తే... ఇక్కడ ఎన్డీఏ కూటమి 50%, ఇండియా కూటమి 38%, ఇతరులు 12% సాధించుకునే అవకాశం ఉందని అంచనా వేయగా... ఇక సీట్ల విషయానికొస్తే... ఎన్డీఏ కూటమికి 8 స్థానాలు, ఇండియా కూటమికి 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.

హిమాచల్ ప్రదేశ్:

హిమాచల్ ప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికలపై ఇండియా టుడే అంచనాలు వార్ వన్ సైడ్ అనే చెబుతున్నాయి. ఇందులో భాగంగా... ఇక్కడ ఎన్డీఏ కూటమికి 60% ఓట్ల షేర్ తో ఉన్న 4 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. 29% ఓట్ల షేర్ తో ఇండియా కూటమి, 11% ఓట్ల షేర్ తో ఇతరులు సున్నా స్థానాలు గెలుచుకుంటారని తెలిపింది.

జమ్మూ & కశ్మీర్:

ఇక జమ్మూ & కశ్మీర్ విషయానికొస్తే ఎన్డీఏ కూటమికి 49%, ఇండియా కూటమికి 36%, ఇతరులకు 15% ఓట్ల షేర్ వస్తాయని.. ఇక లోక్ సభ స్థానాల విషయానికొస్తే ఎన్డీఏ కూటమికి 2, ఇండియా కూటమికి 3 స్థానాలు వస్తాయని అంచనా వేశింది.

పంజాబ్:

పంజాబ్ లో ఇండియా కూటమి 65% ఓట్లు, ఎన్డీఏ కూటమి 17% ఓట్లు, ఇతరులు 18% ఓట్లు సంపాదించుకునే అవకాశం ఉందని అంచనా వేసిన ఇండియా టుడే... సీట్ల విషయానికొచ్చే సరికి ఇండియా కూటమి (ఆప్ 5 – కాంగ్రెస్ 5) 10 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉండగా.. ఎన్డీఏ కూటమికి 3 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.

ఉత్తరాఖండ్:

ఉత్తరాఖండ్ విషయానికొస్తే... ఎన్డీఏ కూటమి 59 ఓట్ల శాతంతో ఉన్న 5 సీట్లను సాధించుకునే అవకాశం ఉందని... ఇక మిగిలిన ఓట్లలో ఇండియా కూటమి 32% ఓట్లు, ఇతరులు 9% ఓట్లతో సున్నా స్థానాల్లో గెలుచుకుంటారని అంచనా వేసింది.

మహారాష్ట్ర:

ఇదే సమయంలో మహారాష్ట్ర విషయానికొస్తే... ఎన్డీఏ కూటమికి 40%, ఇండియా కూటమికి 45%, ఇతరులకు 15% ఓట్ల షేర్ వచ్చే అవాకాశం ఉందని వెల్లడించింది. ఇక సీట్ల విషయానికొస్తే... ఎన్డీఏ కూటమి 22 సీట్లు, ఇండియా కూటమి 26 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఆంధ్రప్రదేశ్:

దక్షిణాదిలో కీలకమైన ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఇక్కడ టీడీపీకి 45%, బీజేపీకి 2%, కాంగ్రెస్ కు 3%, ఇతరులకు 9%, అధికార వైసీపీకి 41% సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసిన ఇండియా టుడే... సీట్ల విషయానికొస్తే 17 టీడీపీకి, 8 వైసీపీకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.

తెలంగాణ:

ఇదే క్రమంలో తెలంగాణ విషయానికొస్తే... తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఇండియా టుడే అంచనా వేయగా... మిగిలిన స్థానాల్లో 3 బీఅరెస్స్, 3 బీజేపీ, 1 ఎంఐఎం గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.

కేరళ:

కేరళ విషయానికొస్తే... ఇక్కడ ఇండియా కూటమి క్లీన్ స్వీప్ అని అంచనా వేసింది ఇండియా టుడే. ఇందులో భాగంగా... ఇక్కడ 78% ఓట్ల తో ఇండియా కూటమి ఉన్న 20స్థానాలనూ గెల్చుకుంటుందని.. ఇక 17% ఓట్లతో ఎన్డీయే కూటమి సున్నా స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించింది.

కర్ణాటక:

కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన ఎన్డీయే కూటమే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటుతుందని అంచనా వేసింది. ఇందులో భాగంగా... 53% ఓట్లతో ఎన్డీఏ కూటమి 24 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉండగా... 42% ఓట్లతో ఇండియా కూటమి 4 స్థానల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది.

తమిళనాడు:

ఇక తమిళనాడులో ఇండియా కూటమి 39కి 39 స్థానాల్లోనూ గెలుపొందే అవకాశం ఉందని ఇండియా టుడే అంచనా వేసింది. ఇక్కడ ఎన్డీఏ కూటమికి 15% ఓట్లతో సున్నా స్థానాలు వస్తాయని తెలిపింది. .

Tags:    

Similar News