యూటర్న్.. కిరణ్ రాయల్ తో లక్ష్మీరెడ్డి రాజీ.. వీడియోతో క్లారిటీ!

కిరణ్ తన వద్ద డబ్బు తీసుకుని, తనను వాడుకుని వదిలేశారంటూ ఆమె మండిపడ్డారు.;

Update: 2025-03-04 13:33 GMT

తిరుపతికి చెందిన జనసేన నేత, పార్టీ ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్‌పై రెండు నెలల క్రితం తీవ్ర ఆరోపణలు వచ్చాయి. లక్ష్మీ రెడ్డి అనే మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం, లక్ష్మీ రెడ్డి మీడియా ముందుకు వచ్చి కిరణ్ రాయల్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కిరణ్ తన వద్ద డబ్బు తీసుకుని, తనను వాడుకుని వదిలేశారంటూ ఆమె మండిపడ్డారు.

ఇంతలో, చెక్ బౌన్స్ కేసులో లక్ష్మీ రెడ్డిపై జైపూర్‌లో కేసులు నమోదు అయ్యాయి, దీంతో ఆమె అరెస్ట్ అయ్యారు. కానీ, బెయిల్‌పై విడుదలైన ఆమె అనంతరం కిరణ్ రాయల్‌తో తన లావాదేవీలకు సంబంధించి ఆధారాలు బయట పెట్టారు. అయితే, ఈ ఉదంతం తాజాగా అనూహ్య మలుపు తిరిగింది.

తిరుపతిలో హఠాత్తుగా ప్రెస్ మీట్ నిర్వహించిన లక్ష్మీ రెడ్డి, కిరణ్ రాయల్‌తో తన వివాదాన్ని రాజీ చేసుకున్నట్లు ప్రకటించారు. ఆర్థిక లావాదేవీలు సర్దుబాటు చేసుకున్నట్లు వెల్లడించారు. తన కుటుంబ సమస్యల వల్లనే ముందుకు వచ్చానని, కానీ రాజకీయ పార్టీలు తనను వాడుకున్నాయని ఆమె ఆరోపించారు. రెండు ప్రధాన పార్టీలు ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా ట్రోల్ చేశాయని చెప్పారు.

తన సమస్యను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని, దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కిరణ్ రాయల్‌తో రాజీకి వచ్చిన తాను, ఈ వ్యవహారం ఇక ముగిసిందని లక్ష్మీ రెడ్డి ప్రకటించారు. ఇది పూర్తిగా వ్యక్తిగత అంశమేనని, రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తనను ఎవరూ బెదిరించలేదని, తన మాటల వల్ల ఎవరికైనా మనస్తాపం కలిగితే క్షమించాలని కోరారు. ఇకపై ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని లక్ష్మీ రెడ్డి మీడియా ముందు తెలిపారు.

Full View
Tags:    

Similar News