భారత్ లోకి ఆ సూపర్ కారు.. మోదీ అమెరికా టూర్ తో రూట్ క్లియర్
టెస్లా.. అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన సంస్థ. ఈ కారు మామూలుగా ఉండదు. కానీ, అతి పెద్దదైన భారత మార్కెట్లోకి మాత్రం రాలేదు.
కార్లు ఎంతో ఖరీదైనవి ఉండొచ్చు.. కానీ, ఆ కారు మాత్రం అద్భుతం.. శాటిలైట్ నావిగేషన్.. పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ).. సూపర్ డిజైన్.. ఇంజినే ఉండదు కాబట్టి బరువు చాలా తేలిక.. అలాంటి కారు గనుక భారత దేశంలోకి వచ్చేస్తే ఇక దున్నేయడమే.. కానీ, ఇన్నాళ్లూ చిన్న నిబంధనతో కాలు పెట్టలేకపోయింది. ఇప్పుడు మాత్రం లైన్ క్లియర్ అయింది.
టెస్లా.. అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన సంస్థ. ఈ కారు మామూలుగా ఉండదు. కానీ, అతి పెద్దదైన భారత మార్కెట్లోకి మాత్రం రాలేదు. 2021 నుంచి ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యం కాలేదు. కారణం.. ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలనేది టెస్లా డిమాండ్. దీనికి కేంద్ర ప్రభుత్వం షరతులు అడ్డొస్తున్నాయి. భారత్ లో తయారీ ప్లాంట్, ఇక్కడే విడిభాగాలు కొనుగోలు చేయాలనే నిబంధనలు పెట్టింది. ఇందుకు మస్క్ ఒప్పుకోకపోవడంతో టెస్లా ఎంట్రీ ఆలస్యమవుతూ వస్తోంది.
అయితే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం 40 వేల డాలర్ల (రూ.34 లక్షలు) కంటే ఎక్కువ ఖరీదైన హై ఎండ్ కార్లపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 110 శాతం నుంచి 70 శాతానికి తగ్గించింది. దీంతో టెస్లా భారత్ లోకి వచ్చేందుకు కాస్త రూట్ ఏర్పడింది.
అమెరికా పర్యటనలో ప్రధాని మోదీతో మస్క్ భేటీలో టారిఫ్ ల గురించి చర్చించారు. ఈ నేపథ్యంలోనే త్వరలో భారత రోడ్లపై టెస్లా కార్లు కనిపించే చాన్సుందనే ప్రచారం జరుగుతోంది
సిబ్బంది కోసం నోటిఫికేషన్..
మోదీ-మస్క్ భేటీ అయిన కొద్ది రోజులకే భారత్ లో సిబ్బంది నియామకానికి టెస్లా నోటిఫికేషన్ ఇచ్చింది. కస్టమర్ రిలేటెడ్, బ్యాక్ ఎండ్ జాబ్ సహా 13 ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులు కావాలంటూ లింక్డిన్లో ప్రకటన చేసింది. సర్వీస్ టెక్నీషియన్, అడ్వైజరీ సహా కనీసం ఐదు పొజిషన్లకు ఉద్యోగులను ముంబై, ఢిల్లీలో, కస్టమర్ ఎంగేజ్ మెంట్ మేనేజర్, డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్ వంటి ఉద్యోగులను ముంబైలో నియమించనుంది.