'మోడీ ఫోన్ కాల్ అందుకే తిరస్కరించా'... వినేశ్ ఫోగట్ సంచలన వ్యాఖ్యలు!

ఈ సందర్భంగా ప్రధాని కాల్ తిరస్కరించడానికి గల కారణాన్ని వెల్లడించారు!

Update: 2024-10-02 15:58 GMT

ఇటీవల ముగిసిన పారిస్ 2024 ఒలింపిక్స్ లో అనర్హత వేటు పటిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనర్హత తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడేందుకు తాను నిరాకరించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని కాల్ తిరస్కరించడానికి గల కారణాన్ని వెల్లడించారు!

అవును... ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తాను పారిస్ ఒలింపిక్స్ 2024 ఫైనల్ పోటీలో అనర్హతకు గురైనప్పుడు మోడీ నుంచి ఫోన్ వస్తే మాట్లాడటానికి నిరాకరించినట్లు చెప్పారు. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా తనపై అనర్హత వేటు పడిన సమయంలో ప్రధాని మోడీ తనకు ఫోన్ చేశారని.. అయితే తాను మాట్లాడటానికి నిరాకరించానని.. కాల్ నేరుగా తనకు రాలేదని.. అక్కడ ఉన్న భారత అధికారులు పీఎం తనతో మాట్లాడలనుకుంటున్నట్లు చెప్పారని.. ఆ సమయంలో తాను సిద్ధంగానే ఉన్నానని ఆమె తెలిపారు.

అయితే... ఆ సమయంలో అధికారు కొన్ని షరతులు పెట్టారని.. ప్రధాని మోడీ వైపు నుంచి ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియా కోసం సంభాషణను రికార్డ్ చేస్తారని చెప్పారని అన్నారు. దీంతో... తన భావోద్వేగాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తనకు ఇష్టం లేనందున కాల్ తిరస్కరించినట్లు ఆమె చెప్పారు.

సంభాషణను ప్రచారం చేసే కండిషన్ లేకుండా ప్రధాని నుంచి నిజమైన కాల్ వస్తే తాను తప్పకుండా అభినందించేదాన్నని.. ఆయన నిజంగా అథ్లెట్ల గురించి శ్రద్ధ వహిస్తే.. రికార్డ్ ప్రస్థావన రాకుండా కాల్ చేసి ఉండేవారని.. కానీ పీఎం మోడీ కార్యాలయం షరతులు విధించిందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

నేరుగా నాతో మాట్లాడితే గత రెండేళ్లలో జరిగిన దాని గురించి అడుగుతాననే విషయం మోడీకి తెలిసి ఉండొచ్చు.. బహుశా అందుకే నా వైపు నుంచి ఫోన్ మాట్లాడే బృందం ఉండకూడదని అధికారులు సూచించారని.. అలా అయితే వారు మాట్లాడిన వీడియో వారికి అనుకూలంగా ఎడిట్ చేయడానికి ఛాన్స్ ఉండదని.. తాను ఒరిజినల్ కాల్ ను బయటపెడతానని వారికి తెలుసని ఆమె అన్నారు.

కాగా... కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా వినేశ్ ఫోగాట్ ఒలింపిక్స్ లో 50 కిలోల రెజ్లింగ్ లో పతకం చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో భారత్ కు తిరిగి వచ్చిన ఆమె.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున బరిలో దిగారు.

Tags:    

Similar News