భూమా కుటుంబాన్ని ఉసిగొల్పింది భార్గవ్ రామ్ యేనా?

Update: 2021-01-17 08:11 GMT
సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి , టీడీపీ నాయకురాలు అఖిలప్రియ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు.

అయితే తాజాగా విచారణలో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. హఫీజ్ పేట భూముల విషయంలో కిడ్నాప్ నకు ప్లాన్ చేసినట్టుగా అఖిలప్రియను పోలీసులు గుర్తించారు. ఏ2గా ఏవీ సుబ్బారెడ్డిని, ఏ3గా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ను చేర్చారు. భార్గవ్ రామ్ పరారీలో ఉండడంతో ఇప్పటికీ అతడి ఆచూకీ దొరకడం లేదు. నాలుగు బృందాలు అతడి కోసం గాలిస్తున్నాయి.

ఈ బోయినపల్లి కిడ్నాప్  కేసు ఎఫ్ ఐఅర్లో భార్గవ్ ఫ్యామిలీ మొత్తాన్ని పోలీసులు చేర్చినట్టు చెబుతున్నారు. కిడ్నాప్ ప్లాన్ నుండి నిందితులు పారిపోయే వరకు భార్గవ్ ఫ్యామిలీ సాయం చేసిందని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది.  భూమా కుటుంబానికి  భార్గవ్ రామ్ గురువుగా మారాడని ప్రచారం సాగుతోంది. సెటిల్మెంట్లకు పురిగొల్పడం, ప్లాన్ చేయడం భార్గవ్ కి పనిగా మారిందని అంటున్నారు పోలీసులు. పాత లెక్కలన్నీ భార్గవ్ రామ్ ముందు అఖిలప్రియ ఉంచినట్టు పోలీసులు గుర్తించారు. వేల కోట్ల సెటిల్మెంట్లకు భార్గవ్ రామ్ ప్లాన్లు వేసినట్టు గుర్తించారు.

 సెటిల్మెంట్లపై అఖిలప్రియ, జగత్ విఖ్యాత్, లకు భార్గవ్ రామ్ బ్రెయిన్ వాష్ చేసినట్టు చెబుతున్నారు. కిడ్నాప్ లు, బెదిరింపులు, కిరాయి మనుషులు ఇదే పంధాలో భార్గవ్ రామ్ ఉన్నాడని అంటున్నారు. ఆదిలోనే బొక్క బోర్లా  పడడంతో దిక్కుతోచని స్థితిలో అఖిలప్రియ ఉందని అంటున్నారు. ఈ కిడ్నాప్ కేసులో అనేక మంది నిందితులను పోలీసులు గుర్తించారు. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో భూమా జగత్ విఖ్యాత్, భార్గవ్ తమ్ముడు చంద్రహాస్ పేర్లను కూడా చేర్చినట్టు చెబుతున్నారు.
Tags:    

Similar News