స్నేహితుల మధ్య సెల్ వివాదం.. హత్యకు దారి తీసింది

Update: 2020-06-27 02:30 GMT
వారిద్దరూ స్నేహితులు. వారి స్నేహానికి సెల్ ఫోన్ పరీక్ష మారింది. చివరకు చిన్న విషయం.. ప్రాణం తీసే వరకూ వెళ్లింది. స్థానికంగా సంచలనంగా మారిన ఈ వ్యవహారంలోకి వెళితే.. ఇంత చిన్న కారణానికి కూడా హత్య చేయాల్సిన అవసరం ఉంటుందా? అన్న క్వశ్చన్ మదిలో మెదలక మానదు. దిల్ సుఖ్ నగర్ కు దగ్గర్లోని సరూర్ నగర్ లో చోటు చేసుకున్న ఈ మర్డర్ వ్యవహారంలోకి వెళితే..

గౌలిపురాకు చెందిన వినయ్.. రక్షాపురానికి సందీప్ స్నేహితులు. వినయ్ పేరు మీద రౌడీ షీట్ ఉంది. సందీప్ మీద పలు స్టేషన్లలో కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. వినయ్ కు తెలిసిన వ్యక్తికి చెందిన సెల్ ఫోన్ ను సందీప్ లాక్కున్నాడు. విషయం వినయ్ వద్దకు వెళ్లింది. ఆ సెల్ ఫోన్ తిరిగి ఇచ్చేయాల్సిందిగా సందీప్ కు చెప్పాడు. ఇది నచ్చని సందీప్.. తన సోదరుడు సంతోష్ కు విషయం చెప్పాడు.

తమకు వినయ్ ఆర్డర్లు వేయటం ఏమిటన్న కోపంతో అన్నదమ్ములు ఇద్దరు కలిసి వారింటికి వెళ్లారు. వినయ్ ఇంట్లో లేడని ఆమె తల్లి చెప్పటంతో.. వాడి అంతు చూసేందుకే తాము వచ్చినట్లుగా చెప్పి వెళ్లిపోయారు. ఇంటికి వచ్చిన వినయ్.. తన స్నేహితుడి రచ్చ గురించి తల్లి ద్వారా విని ఆగ్రహం చెందాడు. దీంతో.. అన్నదమ్ములు ఎక్కడ ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేసిన వినయ్ కు వారిద్దరూ దిల్ సుఖ్ నగర్ పీఅండ్ టీ కాలనీలో ఉన్నట్లు తెలుసుకున్నాడు.

రాత్రి ఒంటి గంట ప్రాంతంలో అన్నదమ్ములు ఉన్న దగ్గరకు వెళ్లిన వినయ్ వారితో వాదనకు దిగాడు. అది కాస్తా గొడవగా మారింది. మత్తులో ఉన్న సందీప్ తన స్నేహితుడన్న ఆలోచన లేకుండా వినయ్ ను విచక్షణరహితంగా కత్తితో దాడి చేశాడు. దీంతో.. తీవ్రగాయాలైన సందీప్ అక్కడిక్కడే మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న వినయ్ తల్లి లలిత పోలీసులకు ఫోన్ చేయటంతో.. అతడి డెడ్ బాడీని ఉస్మానియాకు తరలించారు. చిన్న గొడవ చివరకు ప్రాణం తీసే వరకూ వెళ్లటం సంచలనంగా మారింది.
Tags:    

Similar News