హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు రూ. 70.95 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ బంగారం తరలిస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన అధికారులు ఇద్దరు అంతర్జాతీయ, ఇద్దరు దేశీయ ప్రయాణికుల నుంచి రూ. 70.95 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను సీజ్ చేసినట్లు హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
విదేశీ మార్క్ ఉన్న బంగారు బిస్కెట్ల ఫోటోలను కస్టమ్స్ అధికారులు ట్వీట్ చేశారు. సీజ్ చేసిన బంగారు బిస్కెట్లు 1.38 కిలోల బరువు ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిందితులు విమానంలో దుబాయ్ నుంచి విశాఖపట్నం, ఆపై విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్నారని అధికారులు తెలిపారు. కస్టమ్స్ అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నా ఎప్పటికప్పుడు అక్రమంగా బంగారం తరలిస్తూ... పలువురు పట్టుబడుతూనే ఉన్నారు.
విదేశీ మార్క్ ఉన్న బంగారు బిస్కెట్ల ఫోటోలను కస్టమ్స్ అధికారులు ట్వీట్ చేశారు. సీజ్ చేసిన బంగారు బిస్కెట్లు 1.38 కిలోల బరువు ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిందితులు విమానంలో దుబాయ్ నుంచి విశాఖపట్నం, ఆపై విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్నారని అధికారులు తెలిపారు. కస్టమ్స్ అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నా ఎప్పటికప్పుడు అక్రమంగా బంగారం తరలిస్తూ... పలువురు పట్టుబడుతూనే ఉన్నారు.