భారత తొలి ఓటరు కన్నుమూత

Update: 2022-11-05 08:30 GMT
స్వతంత్ర భారత తొలి ఓటరు.. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన 106 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగి శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు మృతి చెందినట్టు నేగి కుటుంబ సభ్యులు తెలిపారు. మూడు రోజుల క్రితమే ఆయన వచ్చే శాసనసభ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

దేశంలోనే అత్యధిక వయసున్న ఓటరుగా దేశవ్యాప్తంగా గుర్తింపు. భారత ప్రజాస్వామ్య 'లివింగ్ లెజెండ్'గా పేరుపొందిన హిమాచల్ ప్రదేశ్ కు చెందిన 106 ఏళ్ల శ్యాంశరణ్  నేగీ మరోసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు.. వృద్ధాప్యం కారణంగా ప్రభుత్వం ఆయనకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించినా కూడా నిరాకరిస్తూ నడిచి వెళ్లి సొంతంగా ఓటేసేందుకు రెడీ అయ్యారు.అయితే ఆయన సౌకర్యార్థం పోస్టల్ బ్యాలెట్ నే ఆయన చెంతకు తెచ్చి అధికారులు ఓటు వేయించారు.

హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లా ఎన్నికల సంఘం అధికారులు 12డి ఫారాన్ని తీసుకొని నేగీ ఇంటికి వెళ్లారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన మాత్రం ఆ ఫారాన్ని తీసుకోకుండా నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేస్తానంటూ చెప్పడం విశేషం. ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు తెలిపారు. దీంతో వారే కౌంటర్ ను ఇక్కడికి తీసుకొచ్చి ఓటు వేయించారు.

 దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1951లో జరిగిన తొలి లోక్ సభ ఎన్నికల్లో శ్యాం ఓటేశారు. అప్పటి నుంచి లోక్ సభ, అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలు కలిపి మొత్తం 32 సార్లు ఓటేసి యువతానికి ఆదర్శంగా నిలిచారు.1952లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక జరిగిన ఎన్నికల్లో ోటు వేసిన తొలి వ్యక్తి నేగీనే కావడం విశేషం.

హిమాచల్ ప్రదేశ్ లో నవంబర్ 12న అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా.. ఈ ఎన్నికల్లో వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. నవంబర్ 2న నేగి ఈ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికారులే ఆయన ఇంటికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు.

నేగి మృతిపట్ల హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ విచారం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్టు ప్రకటించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News