మోడీ వేడి తగ్గుతోందా?
మోడీ పాలనపై ప్రజల్లో మెల్లమెల్లగా అసంతృప్తి పెరుగుతోందా అంటే అవుననే అంటున్నాయి తాజా సర్వేలు. గత ఏడాది 36 శాతం మంది ప్రజలు మోడీ పాలనపై అసంతృప్తి వ్యక్తంచేయగా ఈ ఏడాది అది 39 శాతానికి పెరగడమే అందుకు ఉదాహరణ. మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికార పగ్గాలను చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో 2 లక్షల మందితో 'లోకల్ సర్కిల్స్ సిటిజన్స్ ఎంగేజ్ మెంట్ ప్లాట్ ఫాం' ఓ సర్వేను నిర్వహించింది. దాని ప్రకారం 61 శాతం మంది మోదీ పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నారు. ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలను వచ్చే రెండేళ్లలో కేంద్రం నెరవేరుస్తుందన్న నమ్మకం తమకుందని 59 శాతం మంది అభిప్రాయపడ్డారు.
అయితే మోడీ పాలనపై అసంతృప్తి మాత్రం నిరుటి కంటే ఈసారి 3 శాతం పెరిగింది. పార్లమెంటు సభల నిర్వహణలో తొలి రెండు సంవత్సరాల్లో కంటే, మూడో సంవత్సరం మోడీ సర్కారు విజయవంతమైందని 65 శాతం మంది చెప్పారు. జీఎస్టీ వంటి కీలక బిల్లుల అమలుకు కేంద్ర వ్యూహాలు ఫలించాయని చెప్పారు. ఇదే సమయంలో ఎంపీలు ఎవరూ నియోజకవర్గాలకు సక్రమంగా రావడం లేదని, క్షేత్ర స్థాయిలో అభివృద్ధి కుంటు పడిందని 69 శాతం మంది అంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, జీవన వ్యయం పెరిగిపోయాయని 66 శాతం మంది అభిప్రాయపడ్డారు.
అన్నిటి కంటే ముఖ్యంగా మోడీ పాలనలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల సంఖ్య ఎంతమాత్రమూ తగ్గలేదని 60 శాతం మంది చెప్పారు. 'స్వచ్ఛ సర్వేక్షణ్ 2017' నివేదికలో 80 శాతం మంది ప్రజలు తమ నగరాలు పరిశుభ్రంగా ఉన్నాయని భావిస్తున్నట్టు వెల్లడించగా, సర్వేలో పాల్గొన్న వారిలో 35 శాతం మంది మాత్రమే దాన్ని అంగీకరించారు. గడచిన మూడు సంవత్సరాల్లో దేశంలో అవినీతి తగ్గిందని 47 శాతం మంది పేర్కొనడా, అన్ని రంగాల్లో విభాగాల్లో లంచాలు తీసుకుంటున్న వారు ఉన్నారని 43 శాతం మంది తెలిపారు.
నోట్ల రద్దు తరువాత లంచగొండితనం తగ్గిందని 39 శాతం మంది చెప్పగా మోడీ నల్లధనాన్ని నియంత్రించడంలో సఫలమయ్యారని 51 శాతం మంది చెప్పారు. కాగా, తొలి సంవత్సరం ఇదే సర్వేలో 68 శాతం మంది, రెండో సంవత్సరంలో 64 శాతం మంది ప్రజలు మోదీ పాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేయగా, ఈ సంవత్సరం అది మరో 3 శాతం తగ్గింది. దీంతో మోడీ పాలన తొలి ఏడాది కంటే మూడో ఏడాదిలో అదనంగా 7 శాతం మందిలో అసంతృప్తి పెరిగినట్లయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
అయితే మోడీ పాలనపై అసంతృప్తి మాత్రం నిరుటి కంటే ఈసారి 3 శాతం పెరిగింది. పార్లమెంటు సభల నిర్వహణలో తొలి రెండు సంవత్సరాల్లో కంటే, మూడో సంవత్సరం మోడీ సర్కారు విజయవంతమైందని 65 శాతం మంది చెప్పారు. జీఎస్టీ వంటి కీలక బిల్లుల అమలుకు కేంద్ర వ్యూహాలు ఫలించాయని చెప్పారు. ఇదే సమయంలో ఎంపీలు ఎవరూ నియోజకవర్గాలకు సక్రమంగా రావడం లేదని, క్షేత్ర స్థాయిలో అభివృద్ధి కుంటు పడిందని 69 శాతం మంది అంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, జీవన వ్యయం పెరిగిపోయాయని 66 శాతం మంది అభిప్రాయపడ్డారు.
అన్నిటి కంటే ముఖ్యంగా మోడీ పాలనలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల సంఖ్య ఎంతమాత్రమూ తగ్గలేదని 60 శాతం మంది చెప్పారు. 'స్వచ్ఛ సర్వేక్షణ్ 2017' నివేదికలో 80 శాతం మంది ప్రజలు తమ నగరాలు పరిశుభ్రంగా ఉన్నాయని భావిస్తున్నట్టు వెల్లడించగా, సర్వేలో పాల్గొన్న వారిలో 35 శాతం మంది మాత్రమే దాన్ని అంగీకరించారు. గడచిన మూడు సంవత్సరాల్లో దేశంలో అవినీతి తగ్గిందని 47 శాతం మంది పేర్కొనడా, అన్ని రంగాల్లో విభాగాల్లో లంచాలు తీసుకుంటున్న వారు ఉన్నారని 43 శాతం మంది తెలిపారు.
నోట్ల రద్దు తరువాత లంచగొండితనం తగ్గిందని 39 శాతం మంది చెప్పగా మోడీ నల్లధనాన్ని నియంత్రించడంలో సఫలమయ్యారని 51 శాతం మంది చెప్పారు. కాగా, తొలి సంవత్సరం ఇదే సర్వేలో 68 శాతం మంది, రెండో సంవత్సరంలో 64 శాతం మంది ప్రజలు మోదీ పాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేయగా, ఈ సంవత్సరం అది మరో 3 శాతం తగ్గింది. దీంతో మోడీ పాలన తొలి ఏడాది కంటే మూడో ఏడాదిలో అదనంగా 7 శాతం మందిలో అసంతృప్తి పెరిగినట్లయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/