చీకటి రాజకీయాలు ఎవరివో తెలుసు: ఎంపీ భరత్ సంచలన వ్యాఖ్యలు

Update: 2021-09-21 08:17 GMT
చీకటి రాజకీయాలు ఎవరివో తెలుసు: ఎంపీ భరత్ సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon
తూర్పు గోదావరి జిల్లా వైసీపీలో రాజకీయాలు వేడెక్కాయి. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా...  రాజమండ్రి ఎంపీ భరత్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.  రాజా తనపై చేసిన కామెంట్స్ కు భారత్ కౌంటర్ ఇచ్చారు.  

తమ కుటుంబం గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని ఎంపీ భరత్ అన్నారు. కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నానని మాట్లాడుతున్నారని.. చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. తాను ఎక్కువగా పనిచేస్తున్నానే బాధేమోనని.. రాజమండ్రిలో ఎన్నో మంచి పనులు చేశానని వివరించాడు. తాను నిస్వార్థంగా పనిచేస్తున్నానని.. చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు అని భరత్ చెప్పుకొచ్చారు.

తాను కిడ్ లా ప్రవర్తిస్తే తేడా ఏముందని.. పార్టీ లక్ష్మణ గీత దాటనని.. ఆయన పరిధిలో ఆయన ఉంటే మంచిదని ఎంపీ భరత్ హితవు పలికారు. కుమ్మక్కు రాజకీయాలు తనకు తెలియవన్నారు.

వీవీ లక్ష్మీ నారాయణతో తాను సెల్ఫీలు తీసుకున్నానని విమర్శించారని.. తనపై ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు.  కాపు సమావేశంలో లక్ష్మీనారాయణను కలిశానని.. తాను పార్లమెంట్ లో చాలా మాట్లాడానని లక్ష్మీనారాయణ అన్నారన్నారు. తాను వెళ్లి సెల్ఫీ తీసుకోలేదని.. వీడియో చూస్తే అర్థమవుతుందన్నారు.

తమ పార్టీలోని ఒక నాయకుడు టీడీపీ నేతలతో కుమ్మక్కై  తనపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిన్న ఆరోపించారు.   పార్టీకి నష్టం కలిగించిన వారిని, కేసులు ఉన్నవారిని దూరంగా పెడితే వారిని తీసుకువచ్చి పార్టీలో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపగా.. తాజాగా ఎంపీ భరత్ కౌంటర్ ఇచ్చాడు.





https://fb.watch/89jGAmxlyg/
Tags:    

Similar News