సొరంగం తవ్వి మరీ రైలు ఇంజిన్‌ను దొంగిలించిన దొంగలు

Update: 2022-11-27 23:30 GMT
బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలోని గర్హరా రైల్వే యార్డుకు సొరంగం తవ్వి మరీ దొంగలు ఏకంగా రైలు ఇంజిన్ ను ఎత్తుకెళ్లారు. గుర్తుతెలియని దొంగలు మరమ్మతుల కోసం యార్డ్‌లో ఉంచిన రైలు డీజిల్ ఇంజిన్‌ను దొంగిలించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.

ముజఫర్‌పూర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) ఇన్‌స్పెక్టర్ పిఎస్ దూబే మాట్లాడుతూ గర్హరా యార్డ్‌కు మరమ్మతుల కోసం తీసుకువచ్చిన డీజిల్ ఇంజిన్ దొంగిలించబడిందని తెలిపారు. బరౌని పోలీస్ స్టేషన్‌లో గత వారం కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. విచారణలో అరెస్టయిన  ముగ్గురు వ్యక్తులు రైల్వే యార్డుకు సొరంగం తవ్వారని, దాని ద్వారా ఇంజిన్ యొక్క లోకోమోటివ్ భాగాలు , ఇతర వస్తువులను బస్తాల్లోకి తీసుకువెళ్లినట్లు చెప్పారు.

అరెస్టయిన వ్యక్తులు విచారణలో స్క్రాప్ గోడౌన్ యజమాని గురించి కూడా ప్రస్తావించారు. సమాచారం ఆధారంగా ముజఫర్‌పూర్ జిల్లాలోని ప్రభాత్ నగర్ ప్రాంతంలోని స్క్రాప్ గోడౌన్‌లో సోదాలు నిర్వహించబడ్డాయి, అక్కడ నుండి పోలీసులు రైళ్లలో ఉపయోగించే 13 బస్తాల నిండా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులలో ఇంజిన్ భాగాలు, పాతకాలపు రైలు ఇంజిన్ల చక్రాలు , భారీ ఇనుముతో చేసిన రైల్వే భాగాలు ఉన్నాయని దూబే చెప్పారు.

స్క్రాప్ గోడౌన్ యజమాని కోసం పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ముఠా స్టీల్ బ్రిడ్జిలను విప్పి వాటి భాగాలను దొంగిలించడంలోనూ నిమగ్నమై ఉందని తేలింది.  గత సంవత్సరం, సమస్తిపూర్ లోకో డీజిల్ షెడ్‌కు చెందిన రైల్వే ఇంజనీర్‌ను పూర్నియా కోర్టు ఆవరణలో ఉంచిన పాత ఆవిరి ఇంజిన్‌ను విక్రయించారనే ఆరోపణలతో సస్పెండ్ చేశారు.  

ఇంజనీర్ ఇతర రైల్వే అధికారులు మరియు భద్రతా సిబ్బందితో కలిసి ఇంజిన్‌ను విక్రయించడానికి సమస్తిపూర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ నకిలీ లేఖను ఉపయోగించాడని తేలింది. తాజాగా మరోసారి ఇక్కడ దొంగలు ఏకంగా రైలు ఇంజిన్ నే దొంగలించడం సంచలనమైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News