చరణ్ గ్యారేజ్ లో మరో లగ్జరీ కార్.. ధర ఎంతంటే?

ప్రస్తుతం వీరి గ్యారేజీలలో ఎన్నో రకాల లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇక తాజాగా రామ్ చరణ్ గ్యారేజీలో మరో లగ్జరీ కారు వచ్చి చేరింది.

Update: 2023-11-22 08:46 GMT

టాలీవుడ్ అగ్ర హీరోల్లో కార్లను అమితంగా ఇష్టపడే వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. చరణ్ తో పాటు తారక్, ప్రభాస్, నాగచైతన్య వంటి హీరోలకు లగ్జరీ కార్లు అంటే పిచ్చి. మార్కెట్లో కొత్తగా ఏదైనా కార్ వచ్చిందంటే కచ్చితంగా ఈ హీరోల్లో ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది. ప్రస్తుతం వీరి గ్యారేజీలలో ఎన్నో రకాల లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇక తాజాగా రామ్ చరణ్ గ్యారేజీలో మరో లగ్జరీ కారు వచ్చి చేరింది.

చరణ్ ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మన వైపు ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. చరణ్ కి వాచ్ లన్నా, లగ్జరీ కార్లు అన్నా చాలా ఇష్టం. ఇప్పటికే ఆయన గ్యారేజీలో అన్ని రకాల లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా రామ్ చరణ్ తనకి ఇష్టమైన ఫెరారీ పోర్టో ఫినో రెడ్ కలర్ కారులో కనిపించాడు. చరణ్ కి ఈ కార్ అంటే చాలా ఇష్టం.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ముఖ్యంగా ఆ కార్ స్టైలిష్ లుక్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. అదిరిపోయే ఫీచర్స్ ఉన్న ఈ కారు ధర సుమారు రూ.3.5 కోట్లు ఉంటుందని అంటున్నారు. కొన్నేళ్ల క్రితమే రామ్ చరణ్ ఈ కారుని కొనుగోలు చేశాడు. ఇటీవల చరణ్ ఈ కారుతో హైదరాబాద్లో తన ఇంట్లో ప్రవేశించినప్పుడు తీసిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తాజాగా చరణ్ ఆ కార్ తో దిగిన ఫోటోలు ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సుమారు రూ.200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ పూర్తయిన వెంటనే బుచ్చిబాబు సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు చరణ్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో రామ్ చరణ్ కి జోడిగా జాన్వి కపూర్, సాయి పల్లవి వంటి హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

Tags:    

Similar News