ఆ హీరో మొహం మీదే మాట్లాడొద్దని చెప్పిన స్వాతి..!

Update: 2022-10-21 04:00 GMT
యాంకర్ గా కెరియర్ మొదలు పెట్టి హీరోయిన్ గా మారి కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు చేసి పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది కలర్స్ స్వాతి. ఆమె చేసిన సినిమాల్లో అష్టా చమ్మ, స్వామి రారా, కార్తికేయ సినిమాలు ఎప్పటికీ ఆమెని గుర్తు చేస్తూనే ఉంటాయి. తెలుగు అమ్మాయే అయినా తమిళంలో కూడా తన మార్క్ చూపించడానికి ప్రయత్నించింది స్వాతి. 2015లో వచ్చిన త్రిపుర తర్వాత అమ్మడు సినిమాల్లో కనిపించలేదు. మధ్యలో లండన్ బాబులు సినిమాలో మెరిసింది స్వాతి.     

కెరియర్ అటు ఇటుగా ఉన్న టైం లోనే 2018లో వికాస్ వసుని పెళ్లాడింది స్వాతి. ఆఫ్టర్ మ్యారేజ్ ఆమె సినిమాలకు దూరంగా ఉంది. త్వరలో రీ ఎంట్రీకి రెడీ అవుతున్న స్వాతి లేటెస్ట్ గా అమేజాన్ ప్రైం లో రిలీజ్ అయిన అమ్ము మూవీ ప్రీమియర్ షోలో కనిపించింది.

నవీన్ చంద్ర, ఐశ్వర్య లక్ష్మి లీడ్ రోల్ లో నటించిన అమ్ము గురువారం డైరెక్ట్ డిజిటల్ రిలీజైంది. ఆ సినిమా ప్రీమియర్ షోలో స్వాతి అలరించింది. సినిమాలో నవీన్ చంద్ర శాడిస్ట్ భర్తగా నటించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ చూసిన స్వాతి ఇంటర్వల్ టైం లో నవీన్ చంద్ర వచ్చి తనతో మాట్లాడటానికి ట్రై చేస్తే నాతో మాట్లాడొద్దు అని మొహం మీద చెప్పేసిందట.  

నవీన్ చంద్ర ఆ పాత్రకు అంత న్యాయం చేశాడని అంటుంది స్వాతి. నవీన్ చంద్రతో స్వాతి త్రిపుర సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా థ్రిల్లర్ జానర్ లో వచ్చింది. సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు కానీ త్రిపుర సినిమా ఎక్స్ పీరియన్స్ సూపర్ అంటుంది స్వాతి. ఆ సినిమా టైం లోనే నవీన్ చంద్ర ఎంత మంచి ఆర్టిస్ట్ అన్నది తెలిసింది.

అతను ఇండస్ట్రీకి దొరికిన ఒక జెమ్ అని అంటుంది స్వాతి.  అందాల రాక్షసి సినిమా నుంచి నవీన్ చంద్ర తన మార్క్ సినిమాలు చేస్తున్న సరే ఎందుకో ఇంకా కెరియర్ లో వెనకనే ఉన్నాడు. హీరోగానే కాదు విలన్ గా కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని చేస్తున్నాడు నవీన్ చంద్ర. ఓటీటీల్లో ఇండిపెండెంట్ మూవీస్, వెబ్ సీరీస్ లకు అతను ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అయ్యాడు.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News