వేడుక చేసుకుంటూ.. కింగ్ క్షమాపణ కోరారెందుకు?

Update: 2022-01-10 04:41 GMT
సంతోషంగా.. సంబరంగా వేడుక చేసుకునే వేళలో.. సారీ చెబుతారా? కానీ.. అలాంటి పనే చేసి ఆశ్చర్యానికి గురి చేశారు కింగ్ నాగార్జున. కాకుంటే.. ఆయన సారీ చెప్పిన కారణాన్ని విన్నప్పుడు మాత్రం.. నిజమే కదా? అన్న భావన కలుగక మానదు. కింగ్ నాగార్జున.. ఆయన తనయుడు కమ్ యువసామ్రాట్ నాగచైతన్య కలిసి.. మొత్తం ఎనిమిది మంది హీరోయిన్లతో కలిపి తెరకెక్కించిన తాజా మూవీ బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయనాకు స్వీకెల్ గా వస్తున్న ఈ మూవీని ఈ నెల 14న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

దీనికి సంబంధించిన మ్యూజికల్ ఈవెంట్ ను ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించారు. జనవరి 14న తమ తాజా మూవీ రిలీజ్ కానుందని.. ఆ తేదీ అన్నపూర్ణ స్టూడియోకు చాలా ముఖ్యమైన తేదీగా పేర్కొన్నారు. అదే రోజున అన్నపూర్ణ స్టూడియో పుట్టిందని.. దసరా బుల్లోడు సినిమాతో 50 ఏళ్ల క్రితం తన తండ్రి దుమ్ములేపిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు.

తాజా సినిమాలో చక్కటి మాస్ కమర్షియల్ పాటల్ని అనూప్ ఇచ్చాడని.. అతడికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన నాగార్జున... తన సినిమాలో సగం సక్సెస్ ను అనూప్ కు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ సినిమా గురించి ఎంత ఊహించారో.. అంతకంటే ఎక్కువే ఈ సినిమాలో ఉంటుందన్న నాగార్జున.. ఈ మూవీ ట్రైలర్ ను 11న విడుదల చేస్తున్నట్లు చెప్పారు.ఈ వేడుకకు అభిమానుల్ని పిలవలేకపోయామని.. తనను అందరూ క్షమించాలని కోరారు.

కరోనా థర్డ్ వేవ్ ఉండటం.. ఇలాంటి వేళ.. వేడుకకు పెద్ద ఎత్తున అభిమానుల్ని పిలవటం రిస్కు అవుతుందన్న ఉద్దేశంతో.. పరిమిత సంఖ్యలో పిలిచిన నేపథ్యంలో.. అందరికీ క్షమాపణలు చెప్పటం ద్వారా.. మనసుల్ని దోచేశారు నాగ్. హ్యాపీగా వేడుక చేసుకునే వేళ.. తమను గుర్తించిన వైనం అభిమానుల్ని మర్చిపోలేరు. ఇప్పటికే ఈ సినిమా మ్యూజికల్ హిట్ అని.. సక్సెస్ మీట్ లో అందరికీ థ్యాంక్స్ చెబుతానన్న నాగ్ మాటల్ని చూస్తే..ఈ సినిమా విజయవంతం కావటం ఖాయమన్న విషయంలో ఆయనెంతో నమ్మకంగా ఉన్నారన్న విషయం అర్థమవుతుంది.




Tags:    

Similar News