ఎడ్వాన్స్ బుకింగ్స్ లో అల దే జోరు!

Update: 2020-01-18 08:25 GMT
సంక్రాంతి సీజన్లో విడుదలయ్యే సినిమాలకు పండగ సీజన్ ఎడ్వాంటేజ్ ఎలాగూ ఉంటుంది.  దానికి కొనసాగింపుగా ఇప్పుడు వీకెండ్ కూడా కలిసి రావడంతో టికెట్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.  అయితే సినిమాలు ఎలా ఉన్నాయి.. ఏది ఫస్ట్ ఛాయిస్ ఏది సెకండ్.. ఏ సినిమాను స్కిప్ చెయ్యాలి అన్నది ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. ఫిలిం మేకర్లు ఎన్ని టక్కుటమార  విద్యలు ప్రదర్శించినా అవన్నీ ప్రేక్షకుల ముందు కుప్పిగంతులు తప్ప మరేమీ కాదు.

ఈ శనివారం హైదరాబాద్ లో మల్టిప్లెక్సుల బుకింగ్ ట్రెండ్స్ చూస్తే ఆ విషయం మనకు అర్థం అవుతుంది.  టికెట్ బుకింగ్ యాప్స్ అయిన బుక్ మై షో లాంటివాటిలో శనివారం ఉదయం పరిస్థితి  ఇలా ఉంది.  అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాకు 85% టికెట్స్ పొద్దునే బుక్ అయ్యాయి.  ఇక 'సరిలేరు నీకెవ్వరు' 55% తో సెకండ్ ప్లేస్ లో ఉంది.  ఇక మురుగ-రజని 'దర్బార్'.. కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివాడవురా' సినిమాలకు స్పందన చాలా తక్కువగా ఉంది.  25% టికెట్ బుకింగ్స్ తోనే ఈ రెండు సినిమాలు సరిపెట్టుకుంటున్నాయి.

వీకెండ్ కాబట్టి అన్ని సినిమాలకు కొంత ఎడ్వాంటేజ్ ఉంటుంది. అయితే సంక్రాంతి సినిమాల్లో అల్లు అర్జున్ సినిమా జోరు మాత్రం సుస్పష్టం. ఈరోజు.. రేపు వీకెండ్ కాబట్టి అన్ని సినిమాలకు కలెక్షన్స్ మెరుగ్గానే ఉంటాయి.  'అల వైకుంఠపురములో' జోరు మరి కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని.. మిగతా సినిమాలకు మాత్రం సోమవారం నుంచి కఠిన పరీక్ష ఎదురుకానుందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.


Tags:    

Similar News