పాపం రంగమ్మత్తనే ఎందుకిలా ఆడుకుంటున్నారు

Update: 2020-02-09 09:06 GMT
జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయకు టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌ లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈమె హీరోయిన్‌ గా.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా వెండి తెర ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈమెకున్న క్రేజ్‌ కారణంగా ఈమెను సోషల్‌ మీడియాలో కొందరు ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. తాజాగా ఈమె ఒక ఫొటోను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అందులో అనసూయ బ్లౌజ్‌ లేకుండా చీరలో ఉన్నట్లుగా మార్ఫింగ్‌ చేశారు. ఆ ఫొటోకు సంబంధించిన ఒరిజినల్‌ ఫొటోను అనసూయ షేర్‌ చేసింది.

తన మార్ఫింగ్‌ ఫొటోపై అనసూయ మండి పండిరది. ఇది నా అసలైన ఫొటో. దీన్ని కొందరు మార్ఫింగ్‌ చేసి ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ మార్ఫింగ్‌ ఫొటో ఎక్కడైనా కనిపిస్తే దయచేసి నాకు ఆ విషయాన్ని తెలియజేయండి అంటూ కోరింది. సోషల్‌ మీడియాలో అనసూయపై ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు కామెంట్‌ చేయడం దాన్ని ఆమె సీరియస్‌ గా తీసుకుని ఘాటు వ్యాఖ్యలు చేయడం చేస్తూనే ఉంది.

ఈ ఫొటోపై ప్రస్తుతం నెటిజన్స్‌ లో కూడా చర్చ జరుగుతుంది. ఒక పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న ఇండియన్‌ స్త్రీను అలా చిత్రీకరించడం ఏమాత్రం బాగాలేదని.. బ్యాడ్‌ కామెంట్స్‌ తో మొదలు పెట్టి ఇది మరింత దూరం వెళ్లి పోతుందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫొటోను మార్ఫింగ్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ అనసూయ అభిమానులు కోరుతున్నారు.
Tags:    

Similar News